Union Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్లోని ముఖ్యాంశాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2024: భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు దేశ మధ్యంతర బడ్జెట్-2024ను సమర్పించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను మొదట వివరించారు. మాకు మహిళలు, పేదలు, యువకులు, రైతులు ఇలా నాలుగు కులాలు ఉన్నాయని, వారిపైనే దృష్టి సారించామన్నారు. పేదలకు ఇళ్లు, సామాన్యులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. దీనితో పాటు ఆర్థిక మంత్రి పలు భారీ ప్రకటనలు కూడా చేశారు.ఈ బడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం…
Read Also: Budget 2024 : దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీలు.. బడ్జెట్లో యువతకు పెద్దపీట
Also Read
- Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
- Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
- OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
- Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
*పన్ను శ్లాబ్లో మార్పు లేదు: ఈసారి పన్ను శ్లాబ్లో ఎలాంటి మార్పు చేయలేదని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. మునుపటిలాగా, ఆదాయపు పన్ను పరిమితి రూ. 7 లక్షలుగా ఉంటుంది, దీని వల్ల ఉద్యోగి ఎటువంటి ప్రయోజనం పొందలేరు.
*ఉచిత విద్యుత్ ప్రకటన: రూఫ్టాప్ సోలారైజేషన్తో రానున్న కాలంలో కోటి కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. దీని ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించనున్నట్లు తెలిపారు. దీనివల్ల రూ.15 వేల నుంచి 18 వేల వరకు ఆదా అవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు.
*ప్రభుత్వం గృహనిర్మాణ పథకం తీసుకువస్తుంది: ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అద్దె ఇళ్లు, మురికివాడలు లేదా అనధికార కాలనీల్లో నివసించే ప్రజలు తమ సొంత ఇళ్లను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొత్త హౌసింగ్ పథకాన్ని తీసుకువస్తుందని సీతారామన్ చెప్పారు.
Read Also: Budget 2024: కోటి కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
* 4 కోట్ల ఇళ్ల లక్ష్యం నెరవేరుస్తాం: ప్రతి పేదవాడికి ఇల్లు అందించేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి అన్నారు. పేదలకు ప్రభుత్వం 2కోట్ల ఇళ్లు అందజేసిందని, 4కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరువలో ఉందన్నారు. 70 శాతం మంది మహిళలకు ఇళ్లు అందించే పని మా ప్రభుత్వం చేసిందని సీతారామన్ అన్నారు.
* వైద్య కళాశాలల విస్తరణ: ప్రస్తుతం ఉన్న ఆసుపత్రి మౌలిక సదుపాయాలను ఉపయోగించి మరిన్ని వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని సీతారామన్ చెప్పారు. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
* గర్భాశయ క్యాన్సర్కు వ్యాక్సినేషన్ ప్రచారం: గర్భాశయ క్యాన్సర్ను తొలగించడానికి ప్రభుత్వం 9-14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు వ్యాక్సినేషన్ను ప్రోత్సహిస్తుంది.
*ఆయుష్మాన్ భారత్ పొడిగింపు: ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లందరికీ ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య సంరక్షణ వర్తిస్తుంది.
*రక్షణ వ్యయం పెరిగింది: ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని 11.1 శాతం పెంచిందని, ఇది జీడీపీలో 3.4 శాతంగా ఉంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రజెంటేషన్లో రైల్వేలు, విమానయానం, ఓడరేవులతో సహా మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. వచ్చే ఏడాది మూలధన వ్యయం 11.1 శాతం పెరిగి రూ.11.11 లక్షల కోట్లకు చేరుకుందని ఆమె చెప్పారు.
* రైల్వేలు అప్గ్రేడ్ చేస్తాం: 40 వేల వందే భారత్ స్థాయి రైల్వే కోచ్లు తయారు చేస్తారు. రద్దీగా ఉండే రైల్వే మార్గాల కోసం 3 ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
*మహిళలు కోటీశ్వరులవుతారు: మా ప్రభుత్వం 3 కోట్ల మంది మహిళలను లక్షపతి దీదీలుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించిందని, ఇప్పటి వరకు కోటి మందిని లక్షపతిగా తీర్చిదిద్దామని ఆర్థిక మంత్రి అన్నారు.
*2047 నాటికి ‘విక్షిత్ భారత్’: ఆర్థిక మంత్రి
2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని ‘విక్షిత్ భారత్’గా మార్చడానికి కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు.
*రైతుల ఆదాయాన్ని పెంచడం
రైతు ఆదాయాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అనుగుణంగా పంటలకు కనీస మద్దతు ధరలను ఎప్పటికప్పుడు పెంచుతున్నామని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. “ అన్నదాతల సంక్షేమం కోసం, ప్రతి సంవత్సరం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద, 11.8 కోట్ల మంది రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించబడుతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా ఇవ్వబడింది. రైతులపైనే మన శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది.” అని ఆమె పేర్కొన్నారు.
*ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంది..
భారత ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందని, అన్ని రంగాల వృద్ధి అంచనాల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, అది కాస్త తగ్గుముఖం పట్టిందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!