Seema Haider: సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు.. విచారిస్తున్న యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీమా.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఆమె సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని సీమా వెల్లడించింది. సీమా స్టేట్మెంట్లు నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్ ను విచారించారు.
Lifestyle : పచ్చని కాపురానికి పనికొచ్చే సూత్రాలు..అవేంటంటే?
Also Read
మరోవైపు సచిన్ తో ప్రేమ విషయాలకు సంబంధించి.. సీమా హైదర్ అన్నీ చెప్పింది. 2019లో తన భర్త గులాం హైదర్ నుండి దూరంగా ఉన్నప్పుడు.. అదే సమయంలో సచిన్ మీనాతో స్నేహం ఏర్పడిందని చెప్పింది. తనకు సచిన్ అంటే చాలా ఇష్టమని, అందుకే పాకిస్థాన్ నుంచి దుబాయ్, అక్కడి నుంచి నేపాల్, ఇప్పుడు నోయిడాకు వచ్చానని సీమా హైదర్ చెప్పింది. యూపీ ఏటీఎస్ విచారణలో సీమా హైదర్ పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. పాకిస్థాన్ సైన్యంలో తన బంధువులు ఉండడం.. అంతగా చదువుకోకపోయినా హిందీ, ఇంగ్లీష్ లో మాట్లాడడం.. నేపాల్ నుంచి అక్రమంగా భారత్ రావడం ఇలా అన్ని ప్రశ్నలపై సీమా తప్పించుకునే సమాధానాలు చెప్పింది. అంతేకాకుండా సచిన్ సీమకు చెందిన నకిలీ ఆధార్ కార్డులను తయారు చేశాడని.. వారిద్దరూ బస చేసిన నేపాల్లోని హోటల్లో తప్పుడు పేరు మరియు చిరునామాను ఇచ్చాడని కూడా తేలింది. దీంతో విచారణలో ఇరువురు విషయాలు దాచిపెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Tamannah : మరోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న తమన్నా..?
అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకుంటారా లేదా పాకిస్థాన్కు తిరిగి పంపిస్తారా అనే విషయాలపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. వారిద్దరిని విచారించిన ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ తన నివేదికను సిద్ధం చేసింది. సీమా, సచిన్లను సుమారు 20 గంటలపాటు విచారించిన తర్వాత ఏటీఎస్ తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో సీమా హైదర్ను పాకిస్థాన్కు తిరిగి పంపించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై యుపి పోలీసు ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ఇది రెండు దేశాల విషయమని, తగిన ఆధారాలు లభించే వరకు ఏమీ చెప్పలేమని అన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!