Tamannah : మరోసారి ఆ స్టార్ హీరోతో కలిసి నటించబోతున్న తమన్నా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో హ్యాపీ డేస్ సినిమాతో మొదలైన తన సినీ కెరీర్ ఆ సినిమా మంచి విజయం సాధించడంతో వరుసగా తెలుగులో ఆఫర్స్ అందుకుని బిజీ హీరోయిన్ గా మారింది. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రభాస్ తో బాహుబలి సినిమాలో నటించి ఇండియా వైడ్ గా మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ తరువాత ఈ భామ చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. రీసెంట్ గా బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లలో నటించింది.ఆమె నటించిన జీకర్థ, లస్ట్ స్టోరీస్ 2 రీసెంట్ గా ఓటీటీ లో విడుదల అయి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. ఈ సిరీస్ లలో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవికి జోడీగా `భోళా శంకర్`లో సినిమాలో నటించింది.అలాగే తమిళంలో రజనీకాంత్ తో `జైలర్`సినిమా కూడా చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్యవధిలోనే ఆగస్టు నెలలో విడుదల కాబోతున్నాయి.అయితే ఈ సినిమాలు విడుదల కాకుండానే తమన్నా మరో క్రేజీ ఆఫర్ అందుకుందని సమాచారం..
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో మరోసారి మిల్కీ బ్యూటీ నటించబోతుంది.గతంలో వీరిద్దరు కలిసి నటించిన `వీరం` ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ వీరి కాంబో రిపీట్ కాబోతోందని సమాచారం.. తునివు హిట్ తరువాత అజిత్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఈ మూవీకి మొదట నయనతార భర్త విఘ్నేష్ శివన్ ను దర్శకుడిగా ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమా కు ‘విడా ముయర్చి’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాకు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఇంకా మొదలు అవ్వలేదు.. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, షూటింగ్ పలు మార్లు వాయిదా పడటంతో త్రిష డేట్స్ ఖాళీగా లేవని సమాచారం.దాంతో ఈ సినిమా నుండి ఆమె తప్పుకున్నారు. మరి ఆమె స్థానంలో తమన్నాను హీరోయిన్ గా తీసుకున్నారని సమాచారం.. అయితే ఈ వార్త పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!