New Delhi Railway: తొక్కిసలాట జరిగినా.. తగ్గని ప్రయాణికుల రద్దీ..
- న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట
- 18 మంది మృతి
- ఇంకా స్టేషన్లో తగ్గని భక్తుల రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి14, 15 ప్లాట్ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా.. ఈ ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు.. ఇప్పటికీ స్టేషన్ ప్రస్తుతం జనంతో కిక్కిరిసిపోయింది. రైళ్లు ఎక్కడానికి జనం ఎగబడుతున్నారు. చాలా మంది అత్యవసర విండో ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నారు.
READ MORE: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
Also Read
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత.. అంటే ఈరోజు బీహార్ సంపర్క్ క్రాంతి ప్లాట్ఫామ్ నంబర్ 16 వద్దకు రాగానే జనాలు ఒక్కసారిగా రైలు ఎక్కడానికి ఎగబడ్డారు. కొంతమంది తలలపై బరువైన వస్తువులను మోసుకుని రైలు ఎక్కేందుకు యత్నించారు. మరికొందరు అత్యవసర విండో ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రదేశం 18 మంది ప్రాణాలను బలిగొన్న ప్రమాదం జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో లేదు. న్యూఢిల్లీ లాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో కూడా జనాలు కిక్కిరిసిపోయారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లోని 11, 12 ప్లాట్ఫారమ్ నంబర్లపై భారీ జనసమూహం కనిపించింది. 11వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి ప్రజలు మాహా కుంభమేళా స్పెషల్ రైలు కోసం ఎదురు చూస్తున్నారు.
READ MORE: Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు
కాగా.. ఈ ప్రమాద ఘటనపై అక్కడే కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న కూలీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. “నేను 1981 నుంచి కూలీగా పనిచేస్తును. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత జనసమూహాన్ని చూడలేదు. ప్రయాగ్రాజ్ స్పెషల్ ట్రైన్ 12వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ.. ఆ ట్రైన్ను 16వ నంబర్ ప్లాట్ఫామ్కు మార్చారు. 12వ ప్లాట్ఫారమ్పై వేచి ఉన్న జనం, బయట వేచి ఉన్న జనం 16వ ప్లాట్ఫారమ్కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు. అక్కడే తొక్కిసలాట జరిగింది.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
-
Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!