Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు..
- టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం
- రష్యన్ చమురు టెర్మినల్ను ప్రభావితం చేసిన మంటలు
- 164 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపిన రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ప్రాంతీయ అధికారులు తెలిపారు. దాడి సమయంలో రష్యా వైమానిక రక్షణ విభాగం 164 ఉక్రేనియన్ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
దాడిపై స్పందించిన రష్యా అధికారులు..
“టుయాప్సేలో జరిగిన UAV (మానవరహిత వైమానిక వాహనం) దాడికి ప్రతిస్పందిస్తున్నట్లు క్రాస్నోడర్ పరిపాలన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో తెలిపింది. సైనిక లాజిస్టిక్స్కు అంతరాయం కలిగించడానికి ఉక్రెయిన్ ఈ దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవని, ఏ పోర్టు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని చెప్పారు. క్రాస్నోడార్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ నివేదికల ప్రకారం.. డ్రోన్ శిథిలాలు పడిపోవడం వల్ల ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు, మంటలు చెలరేగాయి. ఈ ఓడరేవులో టుయాప్సే ఆయిల్ టెర్మినల్, రోస్నెఫ్ట్ నియంత్రణలో ఉన్న టుయాప్సే ఆయిల్ రిఫైనరీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఉక్రేనియన్ డ్రోన్లు రెండు ప్రదేశాలను చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఏ ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని ఈ నివేదికలు పేర్కొన్నాయి.
రష్యన్ విద్యుత్ గ్రిడ్పై దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ – రష్యన్ శుద్ధి కర్మాగారాలు, డిపోలు, పైప్లైన్లపై దాడులను ముమ్మరం చేసింది. ఇంధన సరఫరాలపై ఒత్తిడి తీసుకురావడం, సైనిక లాజిస్టిక్స్కు అంతరాయం కలిగించడం, రష్యా యుద్ధకాల వ్యయాన్ని పెంచడం ఈ దాడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. టుయాప్సే వెలుపల ఉన్న సోస్నోవి గ్రామంలో డ్రోన్ శిథిలాల వల్ల ఒక అపార్ట్మెంట్ భవనం దెబ్బతిన్నట్లు క్రాస్నోడర్ పరిపాలన నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
READ ALSO: Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!