Ukraine Drone Attack: రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు..
- టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం
- రష్యన్ చమురు టెర్మినల్ను ప్రభావితం చేసిన మంటలు
- 164 ఉక్రెయిన్ డ్రోన్లను ధ్వంసం చేసినట్లు తెలిపిన రష్యా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ukraine Drone Attack: రష్యాపై ఆదివారం ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి చేసింది. ఈ దాడి కారణంగా నల్ల సముద్రంలోని రష్యా టుయాప్సే ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ దాడి చాలా తీవ్రంగా ఉండటంతో ఓడరేవులో కొంత భాగంలో మంటలు చెలరేగాయని, ఇది రష్యన్ చమురు టెర్మినల్ను ప్రభావితం చేసిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఉక్రేనియన్ డ్రోన్ దాడి కారణంగా తుయాప్సే వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించిందని, దీంతో ఓడరేవుకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ప్రాంతీయ అధికారులు తెలిపారు. దాడి సమయంలో రష్యా వైమానిక రక్షణ విభాగం 164 ఉక్రేనియన్ డ్రోన్లను గాల్లోనే ధ్వంసం చేసినట్లు పేర్కొంది.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
దాడిపై స్పందించిన రష్యా అధికారులు..
“టుయాప్సేలో జరిగిన UAV (మానవరహిత వైమానిక వాహనం) దాడికి ప్రతిస్పందిస్తున్నట్లు క్రాస్నోడర్ పరిపాలన టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్లో తెలిపింది. సైనిక లాజిస్టిక్స్కు అంతరాయం కలిగించడానికి ఉక్రెయిన్ ఈ దాడి చేసిందని తెలిపింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగినట్లు ఎటువంటి నివేదికలు లేవని, ఏ పోర్టు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని చెప్పారు. క్రాస్నోడార్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ నివేదికల ప్రకారం.. డ్రోన్ శిథిలాలు పడిపోవడం వల్ల ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు, మంటలు చెలరేగాయి. ఈ ఓడరేవులో టుయాప్సే ఆయిల్ టెర్మినల్, రోస్నెఫ్ట్ నియంత్రణలో ఉన్న టుయాప్సే ఆయిల్ రిఫైనరీ ఉన్నాయి. ఈ సంవత్సరం ఉక్రేనియన్ డ్రోన్లు రెండు ప్రదేశాలను చాలాసార్లు లక్ష్యంగా చేసుకున్నాయి. అయితే ఏ ఓడరేవు మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయో వెంటనే స్పష్టంగా తెలియలేదని ఈ నివేదికలు పేర్కొన్నాయి.
రష్యన్ విద్యుత్ గ్రిడ్పై దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ – రష్యన్ శుద్ధి కర్మాగారాలు, డిపోలు, పైప్లైన్లపై దాడులను ముమ్మరం చేసింది. ఇంధన సరఫరాలపై ఒత్తిడి తీసుకురావడం, సైనిక లాజిస్టిక్స్కు అంతరాయం కలిగించడం, రష్యా యుద్ధకాల వ్యయాన్ని పెంచడం ఈ దాడుల లక్ష్యంగా పెట్టుకున్నట్లు సైనిక అధికారులు పేర్కొన్నారు. టుయాప్సే వెలుపల ఉన్న సోస్నోవి గ్రామంలో డ్రోన్ శిథిలాల వల్ల ఒక అపార్ట్మెంట్ భవనం దెబ్బతిన్నట్లు క్రాస్నోడర్ పరిపాలన నివేదికలు వెల్లడించాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
READ ALSO: Rob Jetten: ప్రపంచంలోనే మొట్టమొదటి గే ప్రధానమంత్రి కానున్న రాబ్ జెట్టెన్ ఎవరు ?
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!