Shilparamam : శిల్పారామంలో ‘ఉగాది ఉత్సవం’
హైదరాబాద్లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మంగళవారం మాదాపూర్, ఉప్పల్ ప్రాంగణాల్లో ‘ఉగాది ఉత్సవాన్ని’ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాదాపూర్లోని యాంఫీథియేటర్లో సాయంత్రం డాక్టర్ హిమబిందు కానోజ్ శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శన ‘రీతు శోభ’, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకర శర్మ పాల్గొంటారు. ద్వారా ప్రకటనలు
కాగా, ఉప్పల్లో బ్రహ్మశ్రీ సోమనాథ శాస్త్రిచే పంచాంగ శ్రవణం, శ్రీమతి వాణి రమణ, శ్రీ చంద్రశేఖర్ విద్యార్థులచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుంది. దీనికి తోడు సందర్శకులందరికీ ఉగాది పచ్చడి పంపిణీ చేస్తామని, రెండు చోట్ల ఫుడ్ కోర్టుల్లో సంప్రదాయ ఆహారాన్ని అందజేస్తామని శిల్పారామం సీనియర్ అధికారి తెలిపారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇదిలా ఉంటే.. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి. షడ్రుచుల ద్వారా సుఖదుఖాలకు, శాంతికి, సమృద్ధికి, బాధ్యతలకు, హక్కులకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలన్నది ఉగాది సందేశం. శ్రీ క్రోధి నామ సంవత్సరం కూడా మీ అందరి జీవితాల్లోకి సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సమృద్ధి తీసుకురావాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా, వ్యవసాయం ఆధారంగా.. సనాతన ధర్మంలో పండుగలన్నీ జరిగేలా మన పూర్వీకులు నిర్ణయించారు. మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం.. పండుగలను జరుపుకోవడంలోని అంతరార్థం. మన హక్కులను గుర్తుచేస్తూనే.. ప్రకృతిపట్ల, సమాజం పట్ల మన బాధ్యతలను మన పండుగలు గుర్తుచేస్తాయని, నవ వసంతం సమయంలో జరుపుకునే ఉగాది పండుగ కూడా ఇందులో ఓ భాగం. అందుకే మన పూర్వీకులు సూచించినట్లుగా సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఈసారి ఉగాది పండుగను జరుకుంటారని ఆకాంక్షిస్తున్నానన్నారు. వచ్చే నెల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్న సంగతి మీకు తెలిసిందే. ఈసారి పెద్ద సంఖ్యలో.. పోలింగ్ కేంద్రాలకు తరలిరండి. ఓటింగ్ శాతాన్ని పెంచాలని మిమ్మల్ని కోరుతున్నానని, మరోసారి మీ అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో