Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాన్స్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు ఈఫిల్ టవర్. ప్రపంచ ప్రసిద్ధ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. దీనిని చూసేందుకు లక్షల్లో టూరిస్ట్ లు పారిస్ కు ప్రతి యేటా క్యూ కడుతూ ఉంటారు. సినిమాల్లో కూడా దీనిని ప్రత్యేకంగా చూపిస్తూ ఉంటారు. ఇక అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అయితే ఈఫిల్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. అంత ఎతైన ఈఫిల్ టవర్ నుంచి పారిస్ నగరాన్ని చూడాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ టవర్ లోని చివరి రెండు అంతస్తులకు వెళ్లడానికి టూరిస్టులకు అనుమతి ఉండదు. అయితే అమెరికాకు చెందిన ఇద్దరు టూరిస్టులు మాత్రం తప్పతాగి మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక అనుమతిలేని ఈ రెండు టవర్లు ఎక్కి నిద్రపోయారు. అనంతరం జైలు పాలయ్యారు.
ఆగస్టు 13 న ఈ సంఘటన జరిగింది. అమెరికా నుంచి ఇద్దరు టూరిస్టులు ఆగస్టు 13న రాత్రి 10.40 గంటలకు టికెట్లు తీసుకొని ఈఫిల్ టవర్ ఎక్కారు. అప్పటికే వారు తాగి ఉన్నారు. మద్యం మత్తులో వారు అనుమతిలేని చివరిదైన రెండో లెవల్ కు వెళ్లారు. సందర్శన సమయం అయిపోయేసరికి ఆ రోజు అందరిని ఈఫిల్ టవర్ సిబ్బంది కిందకు పంపించేసింది. అయితే వీరు మాత్రం భద్రతా సిబ్బంది కళ్లుగప్పి చివరి రెండో లెవల్ కు చేరుకోవడంతో పోలీసులు వీరిని గుర్తించలేకపోయారు. పీకల దాక తాగి ఉండటంతో మద్యం మత్తులో కిందకి దిగలేక వారు అక్కడే హాయిగా నిద్రపోయారు. తరువాతి రోజు ఉదయం భద్రతా సిబ్బంది గస్తీ చేస్తున్న సమయంలో అనుమతిలేని ప్రాంతంలో టూరిస్ట్లు నిద్రపోతున్న దృశ్యాన్ని చూసి షాకయ్యారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్పైటర్లు, రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. వారిని అంత ఎత్తు నుంచి జాగ్రత్త దించారు. అయితే అనంతరం ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Also Read: Honor 90: హానర్ లవర్స్కు గుడ్ న్యూస్.. సరికొత్త మోడళ్లతో ఇండియాలోకి రీఎంట్రీ
అయితే గతంలో కూడా ఈఫెల్ టవర్ లో బాంబు పెట్టనట్లు ఫోన్లు వచ్చాయి. దీంతో టవర్, పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని.. సందర్శకులను బయటకు పంపి పోలీసులు అణువణువు తనిఖీ చేశారు. ఎటువంటి అనుమానిత వస్తువుల లభ్యం కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వారి అచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలా టూరిస్టులు నిద్రపోయిన విషయం ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!