Delhi Rains: ఢిల్లీలో మరో రెండు రోజులు పాఠశాలలకు సెలవు.. వరద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పట్టినప్పటికీ చాలా ప్రాంతాలు ఇంకా నీటితో నిండిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. పాఠశాలల్లో ఈ సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు. దాని కారణంగా ఢిల్లీలోని అన్ని పాఠశాలలు జూలై 17 మరియు 18 తేదీలలో మూసివేయనున్నట్లు.. ఢిల్లీ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు, ఈశాన్య, సౌత్ ఈస్ట్, నార్త్, నార్త్ వెస్ట్ మరియు సెంట్రల్ జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రెండ్రోజుల పాటు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. మరోవైపు DOE (నార్త్ వెస్ట్-బి, వెస్ట్-ఎ, వెస్ట్-బి, సౌత్, సౌత్ వెస్ట్-ఎ, సౌత్ వెస్ట్-బి మరియు న్యూ ఢిల్లీ) మిగిలిన అన్ని పాఠశాలలు (ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన మరియు ప్రైవేట్ గుర్తింపు పొందినవి) సోమవారం యథావిధిగా ఓపెన్ కానున్నాయి.
Pawan Kalyan: రేపు తిరుపతికి పవన్.. అంజు యాదవ్పై ఎస్పీకి ఫిర్యాదు
Also Read
- Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
జూలై 13నుంచి యమునా నది నీటిమట్టం పెరుగుతూనే ఉన్నందున.. జూలై 16 వరకు ఢిల్లీలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనవసర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ఆదేశించింది. మరోవైపు ఢిల్లీలోని రోడ్లపై నీరు నిలిచిపోవడం, ఇళ్లు కూలిపోవడం మరియు ట్రాఫిక్ జామ్లు వంటివి చాలా జరుగుతున్నాయి.
Viral Video: ప్రవహిస్తున్న వరదలో కారు నడిపిన వ్యక్తి.. వీడియో వైరల్..!
అంతేకాకుండా.. వరద బాధిత కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ప్రకటించారు. యమునా నది ఒడ్డున నివసిస్తున్న పేద కుటుంబాలు వరదల్లో తమ ఇళ్లు కోల్పోయాయని కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా నిత్యవసర వస్తువులన్నీ పోగొట్టుకున్నారు. దీంతో వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. యమునా నది నీటిమట్టం తగ్గుముఖం పడుతోందని.. త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేజ్రీవాల్ అన్నారు.
తాజావార్తలు
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
-
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
-
Kangana Ranaut: మెడలో నల్లపూసలు.. చేతికి గాజులు..కంగనా రనౌత్ సీక్రెట్గా పెళ్లి చేసుకుందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!