Cheetah Cubs Die : కునో పార్కులో మరో రెండు చిరుత పిల్లల మృతి.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.
Also Read : Bank Holidays: జూన్లో 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
Also Read
- Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో గురువారం మరో రెండు పిల్ల మరణాలు సంభవించాయి. దీనితో, చిరుత మరణాల సంఖ్య మొత్తం ఆరుకి చేరుకుంది. ఇందులో మూడు పిల్లలు ఉండగా మరో మూడు పెద్ద చిరుతలు. అంతరించిపోతున్న వన్యప్రాణులను గత సంవత్సరం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అంతరించి పోతున్న చిరత జాతిని రక్షించేందుకు వాటి జనాభాను పునరుద్ధరించడానికి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
Also Read : BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో
భారతదేశంలో ఆరు చిరుతలు ఎలా చనిపోయాయి?
కునో నేషనల్ పార్క్లో తిరిగి ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశంలో మూడు వయోజన చిరుతలు చనిపోయాయి. వీటిలో కిడ్నీ సమస్యల కారణంగా మార్చి 27న మరణించిన ఆడ చిరుత సాష్ కూడా ఉంది. దాని తర్వాత, మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 24న గుండె వైఫల్యం కారణంగా మరణించింది. మే 9న దక్ష అనే మరో ఆడ చిరుత సంభోగం సమయంలో మరొక మగ చిరుతతో గొడవపడి మరణించింది. తాజా మరణాలతో కునోలో గత రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో ఒక్క పిల్ల మాత్రమే మిగిలి ఉంది.
Also Read : Pawan Kalyan: తగ్గేదేలే.. OG విలన్గా స్టార్ హీరో?
మొదటి పిల్ల బలహీనతతో చనిపోయిందని అటవీ శాఖ అధికారి తెలిపారు.అన్ని చిరుత పిల్లలూ బలహీనంగా, తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మొదటి సారి డెలివరీ అయిన జ్వాల హుంద్ రియాద్ జాతికి చెందినది. పిల్లలు, దాదాపు ఎనిమిది వారాల వయస్సులో ఉన్నప్పుడు, తమ తల్లి చుట్టూ గుమికూడి ఉండాలని కోరుకుంటాయి. అవి 8-10 రోజుల క్రితం తమ తల్లితో కలిసి నడవడం ప్రారంభించాయని రెండు పిల్లల మరణం తర్వాత కునో నేషనల్ పార్క్ తెలిపింది. కునో నేషనల్ పార్క్ లో మూడు చిరుతల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మే 18 న సుప్రీంకోర్టు చిరుతలను రాజస్థాన్కు తరలించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
తాజావార్తలు
-
Natural Home Cooling Tips: కూలర్, ఏసీ లేకుండానే కూల్ కూల్గా ఇల్లు.. ! మన తాతముత్తాతలు ఉపయోగించిన చిట్కాలు ఇవే..!
-
Peddi : చరణ్ ‘పెద్ది’ కోసం రంగంలోకి బాలయ్య..!
-
Xiaomi 17 Max: 8000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో.. షియోమీ 17 మ్యాక్స్ విడుదల
-
Sai Abhyankar: ట్రోల్స్ను ట్రెండ్గా మార్చిన సాయి అభ్యంకర్..
-
Bike Insurance: బైక్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే ఫైన్ మాత్రమే కాదు.. భారీ నష్టాలు కూడా
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!