Cheetah Cubs Die : కునో పార్కులో మరో రెండు చిరుత పిల్లల మృతి.. అసలేం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీతాకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇప్పటికే మూడు చీతాలు, ఓ చిరుత పిల్ల మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం మరో రెండు చిరుత పులి పిల్లలు మృతి చెందాయి. నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుత జ్వాలాకు ఇటీవల నాలుగు పిల్లలు జన్మించాయి. నాలుగు పిల్లలో ఒకటి మంగళవారం తెల్లవారు జామున మరణించింది. గురువారం మరో రెండు పిల్లలు మరణించడం ఆందోళన కలిగిస్తున్నది.
Also Read : Bank Holidays: జూన్లో 12 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ వద్ద చిరుతల మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. భారతదేశంలో గురువారం మరో రెండు పిల్ల మరణాలు సంభవించాయి. దీనితో, చిరుత మరణాల సంఖ్య మొత్తం ఆరుకి చేరుకుంది. ఇందులో మూడు పిల్లలు ఉండగా మరో మూడు పెద్ద చిరుతలు. అంతరించిపోతున్న వన్యప్రాణులను గత సంవత్సరం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తీసుకువచ్చారు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా అంతరించి పోతున్న చిరత జాతిని రక్షించేందుకు వాటి జనాభాను పునరుద్ధరించడానికి ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.
Also Read : BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో
భారతదేశంలో ఆరు చిరుతలు ఎలా చనిపోయాయి?
కునో నేషనల్ పార్క్లో తిరిగి ప్రవేశపెట్టినప్పటి నుంచి భారతదేశంలో మూడు వయోజన చిరుతలు చనిపోయాయి. వీటిలో కిడ్నీ సమస్యల కారణంగా మార్చి 27న మరణించిన ఆడ చిరుత సాష్ కూడా ఉంది. దాని తర్వాత, మగ చిరుత ఉదయ్ ఏప్రిల్ 24న గుండె వైఫల్యం కారణంగా మరణించింది. మే 9న దక్ష అనే మరో ఆడ చిరుత సంభోగం సమయంలో మరొక మగ చిరుతతో గొడవపడి మరణించింది. తాజా మరణాలతో కునోలో గత రెండు నెలల్లో మరణించిన చిరుతల సంఖ్య ఆరుకు చేరుకుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్లో ఒక్క పిల్ల మాత్రమే మిగిలి ఉంది.
Also Read : Pawan Kalyan: తగ్గేదేలే.. OG విలన్గా స్టార్ హీరో?
మొదటి పిల్ల బలహీనతతో చనిపోయిందని అటవీ శాఖ అధికారి తెలిపారు.అన్ని చిరుత పిల్లలూ బలహీనంగా, తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. మొదటి సారి డెలివరీ అయిన జ్వాల హుంద్ రియాద్ జాతికి చెందినది. పిల్లలు, దాదాపు ఎనిమిది వారాల వయస్సులో ఉన్నప్పుడు, తమ తల్లి చుట్టూ గుమికూడి ఉండాలని కోరుకుంటాయి. అవి 8-10 రోజుల క్రితం తమ తల్లితో కలిసి నడవడం ప్రారంభించాయని రెండు పిల్లల మరణం తర్వాత కునో నేషనల్ పార్క్ తెలిపింది. కునో నేషనల్ పార్క్ లో మూడు చిరుతల మరణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మే 18 న సుప్రీంకోర్టు చిరుతలను రాజస్థాన్కు తరలించే విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరింది.
తాజావార్తలు
-
NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!