Chhattisgarh: ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి.. భారీగా ఆయుధాలు స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించగా.. పొరుగున ఉన్న సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారని పోలీసు అధికారి శనివారం తెలిపారు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వివిధ భద్రతా బలగాలకు చెందిన సిబ్బంది నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లో ఉండగా కాల్పులు జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే బీజాపూర్, దంతేవాడ, సుక్మా జిల్లాల ట్రై జంక్షన్లో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), ‘బస్తర్ ఫైటర్స్’, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) మరియు మూడు జిల్లాల నుంచి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)కి చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. రాజధాని రాయ్పూర్కు 450 కిలోమీటర్ల దూరంలోని పిడియా గ్రామ సమీపంలోని అటవీప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టినప్పుడు నక్సలైట్లు కాల్పులు జరిపారని, దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన చెప్పారు.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Read Also: Rekha Jhunjhunwala: సముద్ర వ్యూ చెడిపోతుందని.. రూ.118 కోట్లతో బిల్డింగ్ మొత్తాన్ని..
కాల్పుల అనంతరం, ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు ఆయుధాలు కూడా అక్కడి నుంచి స్వాధీనం చేసుకున్నామని అధికారి తెలిపారు. ఇద్దరు మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్ధారణ కాలేదని, ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఐజీ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి అదే ఆపరేషన్లో భాగంగా దంతెవాడ-సుక్మా సరిహద్దులో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) పేలడంతో బస్తర్ ఫైటర్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఐజీ సుందర్రాజ్ తెలిపారు. సుక్మా జిల్లాలోని జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడితుమ్నార్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో అంతర్ జిల్లా సరిహద్దులో ఉన్న అటవీప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు పేలుడు సంభవించిందని ఆయన చెప్పారు.
గాయపడిన జవాన్లను బస్తర్ ఫైటర్స్-దంతెవాడకు చెందిన కానిస్టేబుళ్లు వికాస్ కుమార్ కర్మ, రాకేష్ కుమార్ మార్కంగా గుర్తించారు. తదుపరి చికిత్స కోసం రాయ్పూర్కు విమానంలో తరలించే ముందు ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు. గాయపడిన జవాన్లు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!