Dubai: షార్జా అగ్నిప్రమాదంలో రెహమాన్ దగ్గర పని చేసిన సౌండ్ ఇంజనీర్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత గురువారం రాత్రి యూఏఈ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో షార్జా అల్ నహ్దా రెసిడెన్షియల్ టవర్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఐదుగురు మృతిచెందగా.. ఇందులో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఇటీవలే వివాహమైన ముంబైకి చెందిన నవ వధువు ప్రాణాలు కోల్పోగా.. ఆమె భర్త తీవ్ర గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్.రెహమాన్ దగ్గర సౌండ్ ఇంజనీర్గా పని చేసిన మైఖేల్ సత్యదాస్ కూడా ప్రాణాలు వదిలాడు. ఈ మేరకు సత్యదాస్ సోదరుడు సోషల్ మీడియా వేదికగా సమాచారాన్ని తెలియజేశాడు.

Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
గత గురువారం రాత్రి షార్జాలోని అల్ నహ్దాలో 750 అపార్ట్మెంట్లతో కూడిన 39 అంతస్తుల టవర్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా 44 మంది గాయపడ్డారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో ముంబైకి చెందిన నవ వధువు మృతి చెందడం.. ఆమె భర్త ప్రాణాలతో కొట్టిమిట్టాడడం హృదయాలను కలిచివేసే సంఘటన. ఇక మైఖేల్ సత్యదాస్ అయితే.. సంగీత దర్శకుడు రెహమాన్తో పాటు అనేక మంది కళాకారుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది.
ఇది కూడా చదవండి: Chiranjeevi: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?
తన సోదరుడు మైఖేల్ సత్యదాస్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం.. దీన్ని జీర్ణించుకోలేని విషయమని మైఖేల్ సత్యదాస్ సోదరుడు ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంతో దుఖంతో ఉన్నామని.. సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. మైఖేల్ ఎప్పుడూ మా జ్ఞాపకాల్లో ఉంటాడని ఎక్స్లో ఇమ్మాన్యుయేల్ సత్యదాస్ వ్రాసుకొచ్చాడు. మైఖేల్ సత్యదాస్ దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డీహెచ్బీ లైవ్లో ఉద్యోగిగా ఉన్నాడు. 2022లో దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో మైఖేల్ కుటుంబ సభ్యుడయ్యాడని DXB లైవ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్
ముంబైకి చెందిన మహిళ(29)కు ఫిబ్రవరిలోనే వివాహం అయింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఇక ఆమె భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ మేరకు మృతురాలి స్నేహితుడు సోషల్ మీడియాలో తెలియజేశాడు. అలాగే భారత కాన్సులేట్ జనరల్ కూడా వారి మరణాలను ధృవీకరించింది. పలువురు గాయపడినట్లుగా కూడా పేర్కొంది. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Rohit Sharma: ‘వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు..’ డ్రెస్సింగ్ రూమ్లో రోహిత్ శర్మ స్పీచ్..!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..