Armenia-Azerbaijan War: మరోసారి యుద్ధం.. భారత్ ఆయుధాలకు ఆ దేశం భయపడుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Armenia-Azerbaijan War: అర్మేనియా, అజర్బైజాన్ మధ్య మరోసారి యుద్ధం మొదలైంది. నాగోర్నో-కరాబాఖ్లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తలపడుతున్నాయి. నాగోర్నో-కరాబాఖ్ అంతర్జాతీయంగా అజర్బైజాన్లో భాగం, అయితే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అర్మేనియా నియంత్రణలో ఉంది. రెండు దేశాలు ఈ భాగంలో తమ హక్కులను ఏర్పరుస్తాయి. ఈ కారణంగా 1991 నుంచి అర్మేనియా, అజర్బైజాన్ మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. 2020లో కూడా, అర్మేనియా, అజర్బైజాన్ల మధ్య నాగోర్నో-కరాబాఖ్పై 3 నెలల పాటు భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అర్మేనియా భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. అప్పటి నుంచి అర్మేనియా తన సైనిక బలాన్ని నిరంతరం పెంచుకుంటూ పోయింది. ఆర్మేనియా భారతదేశం నుంచి పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్, 155 ఎంఎం ఫిరంగిని కొనుగోలు చేసింది. అదే సమయంలో అర్మేనియా అమెరికన్ ఆర్మీతో కూడా కసరత్తులు చేస్తోంది.
Also Read: Armenia-Azerbaijan War: అర్మేనియాపై మరోసారి యుద్ధం ప్రకటించిన అజర్బైజాన్
Also Read
- New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
- Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
- Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
- Mohammad Kaif: ‘రిటైర్మెంట్ ముచ్చట ముగిసింది.. విమర్శకుల ముక్కు కట్ అయింది’: మహ్మద్ కైఫ్
భారత్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేసిన అర్మేనియా
2020 పరాజయం తర్వాత ఆర్మేనియా తన సైన్యాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం నుంచి అనేక ఆయుధాలను అర్మేనియా కొనుగోలు చేసింది. ఇందులో పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్, స్వదేశీ హోవిట్జర్ TC-40 ఉన్నాయి. నివేదికల ప్రకారం ఈ 155 మిమీ హోవిట్జర్, పినాకా రాకెట్ వ్యవస్థ మొదటిసారి ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ ద్వారా అర్మేనియాకు పంపబడింది. పినాకా రాకెట్ వ్యవస్థలోని ఒక రాకెట్ లాంచర్ 60 మీటర్ల విస్తీర్ణంలో ప్రతిదీ నాశనం చేయగలదు. ఇది అజర్బైజాన్ సైనిక స్థావరం, ఆర్మర్ కాలమ్, రాడార్ స్టేషన్ను రెప్పపాటులో నేలమట్టం చేస్తుంది. అయితే TC-20, మల్టీ టెర్రైన్ ఆర్టిలరీ గన్ అనేది 155 mm/39 క్యాలిబర్ అల్ట్రా లైట్ హోవిట్జర్ యొక్క స్టీల్ వేరియంట్. ఈ హోవిట్జర్ 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. ట్రక్కు-మౌంట్ అయినందున దాని కదలిక చాలా ఎక్కువగా ఉంటుంది.
భారత్ ఆయుధాలకు అజర్బైజాన్ భయపడుతోందా?
భారత్-అర్మేనియా రక్షణ కొనుగోళ్లపై అజర్బైజాన్ ఇప్పటికే ఆందోళన చెందుతోంది. భారత్ గత నెలలో అర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించినప్పుడు కూడా అజర్బైజాన్లో అశాంతి స్పష్టంగా కనిపించింది. నివేదికల ప్రకారం, ఈ వార్త తర్వాత, అజర్బైజాన్ జాతీయ భద్రతా సలహాదారు భారత రాయబారిని కలుసుకున్నారు. అర్మేనియాతో పెరుగుతున్న భారతదేశ సైనిక సహకారంపై ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, అజర్బైజాన్ ఆందోళనపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. భారతదేశం ఆర్మేనియాకు ఆయుధాలను సరఫరా చేయడం ప్రారంభించిందా లేదా ఇంకా పెండింగ్లో ఉందా అనే దానిపై అధికారిక ధృవీకరణ లేదు.
Also Read: Anantnag Encounter: లష్కర్ కమాండర్ ఉజైర్ ఖాన్ హతం.. ముగిసిన అనంతనాగ్ ఎన్కౌంటర్
అజర్బైజాన్-అర్మేనియా మధ్య ఎందుకీ ఉద్రిక్తత?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుం;f అర్మేనియా, అజర్బైజాన్ నాగోర్నో-కరాబాఖ్పై పరస్పరం యుద్ధం చేస్తున్నాయి. నాగోర్నో-కరాబఖ్ ప్రాంతం 4400 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం అర్మేనియన్ జాతి సమూహాలచే ఆక్రమించబడింది. 1991లో ఈ ప్రాంత ప్రజలు అజర్బైజాన్ నుంచి స్వతంత్రంగా ప్రకటించుకుని అర్మేనియాలో చేరారు. అప్పటి నుంచి అర్మేనియా దానిని తన భాగంగా పరిగణిస్తుంది. అయితే అజర్బైజాన్ కూడా దానిని తన సొంతంగా పరిగణిస్తుంది. అదే సమయంలో నాగోర్నో-కరాబాఖ్లోని కొంతమంది ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తారు. అధ్యక్ష ఎన్నికలు ఇటీవల నాగోర్నో-కరాబాఖ్లో జరిగాయి. దీనికి సంబంధించి అజర్బైజాన్ కూడా తీవ్రంగా స్పందించింది. అప్పటి నుండి నాగోర్నో-కరాబాఖ్లో అర్మేనియా, అజర్బైజాన్ సైన్యాల మధ్య చెదురుమదురు ఘర్షణలు ప్రారంభమయ్యాయి.
రష్యా కారణంగా రెండు దేశాలు యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి!
ఆర్మేనియా, అజర్బైజాన్ రెండూ 19వ శతాబ్దం ప్రారంభంలో స్వతంత్ర దేశాలుగా ఉద్భవించాయి. అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య తీవ్రమైన సరిహద్దు వివాదం నెలకొంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత, ట్రాన్స్కాకేసియన్ ఫెడరేషన్లో మూడవ వంతు విడిపోయినప్పుడు దీని ప్రభావం కనిపించింది. ట్రాన్స్కాకేసియన్ ఫెడరేషన్ను ప్రస్తుతం జార్జియా అని పిలుస్తారు. తరువాత 1922లో ఆర్మేనియా, అజర్బైజాన్, జార్జియా మూడు సోవియట్ యూనియన్లో చేరాయి. ఆ సమయంలో, రష్యాలో గొప్ప నాయకుడిగా ప్రసిద్ధి చెందిన జోసెఫ్ స్టాలిన్, నాగోర్నో-కరాబాఖ్ను అర్మేనియాకు అప్పగించాడు. ఆ సమయంలో ఈ భాగం అజర్బైజాన్ ఆధీనంలో ఉంది, కానీ సోవియట్ యూనియన్ ఒత్తిడితో అది నాగోర్నో-కరాబాఖ్ నుంచి దాని ఆక్రమణను తొలగించవలసి వచ్చింది.
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!