Pakistan: భారత్లో ఉంటూ.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. కట్ చేస్తే..
- సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలు పోస్ట్
- ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో చోటు చేసుకున్న ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్స్టాగ్రామ్లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
READ MORE: Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
స్థానిక ఎస్హెచ్ఓ అభిషేక్ కుమార్ ప్రకారం.. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత.. స్థానిక ప్రజల్లో కోపం చెలరేగింది. పోలీసులకు ఈ వీడియో గురించి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఇర్ఫాన్, వాజిద్ షాలపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్ 353 (2), ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Siraj : ఏడేళ్లు హైదరాబాద్లో సిరాజ్ మకాం.. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో…
కాగా.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్లో దేశ వ్యతిరేకులు బయటపడుతున్నారు. తాజాగా విడుదలైన వీడియో తీసిన వాళ్లు ఒక్కటే కాదు.. పాకిస్థాన్కు సపోర్టు చేసేవాళ్ల బయట చాలా మంది ఉన్నారని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే కార్యకలాపాలను ప్రోత్సహించే కుట్ర అని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!