Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లతో పాటు గదులూ విడుదల

Tirumala

Tirumala

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబ‌రు 23 నుంచి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనానికి సంబంధించి రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లు, శ్రీ‌వాణి ద‌ర్శన టికెట్లు, గ‌దుల కోటాను న‌వంబ‌రు 10న టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 22500 చోప్పున పది రోజులుకు 2.25 లక్షల టికెట్లు విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. రోజుకి 2 వేల చొప్పున 20 వేల టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదులు కోటా విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాలను గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.

Also Read: Swadesh Store: మొదటి ‘స్వదేశ్’ స్టోర్‌ను తెరిచిన రిలయన్స్ రిటైల్

డిసెంబర్ 22న వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో 4.25 లక్షల టైంస్లాట్ సర్వ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని టీటీడీ తెలిపింది.

Exit mobile version