Site icon NTV Telugu

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన

Tirumala

Tirumala

Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్‌ విధానంలో పొందే ఆర్జిత సేవలకు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.

Read Also: AP Fiber net Case: చంద్రబాబు కేసులో ట్విస్ట్‌… ఇవాళ విచారణకు రాని ఫైబర్‌ నెట్ కేసు

23వ తేది ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్దులు, వికలాంగుల దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు రూ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. 27వ తేదీ ఉదయం 11 గంటల నుంచి శ్రీవారి సేవా కోటాను టీటీడీ విడుదల చేయనుంది.

Exit mobile version