Tirumala Prank Video: తిరుమల క్యూలైన్లో ప్రాంక్ వీడియో.. టీటీడీ సీరియస్
- తిరుమలలో ఆకతాయిల హల్చల్..
- క్యూలైన్ కాంప్లెక్స్లో ప్రాంక్ వీడియోలు..
- ప్రాంక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తమిళ యువకులు..
- ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ.. చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Prank Video: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఆకతాయిలు హల్చల్ చేశారు.. నారాయణగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్ కాంప్లెక్స్ల్లో ప్రాంక్ వీడియోలు తీసి.. భక్తులను గందరగోళానికి గురిచేశారు.. క్యూలైన్లలో ప్రాంక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు తమిళ యువకులు.. కంపార్టుమెంట్ గేట్లు తెరుస్తున్నట్లు చేసి.. భక్తులతో పరిహాసాలు ఆడారు.. అయితే, ప్రాంక్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ.. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్చగా పేర్కొన్న టీటీడీ.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్యగా పేర్కొన్న టీటీడీ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
Read Also: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
Also Read
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
- POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
కాగా, నారాయణగిరి షెడ్స్ లోని క్యూకాంపెక్స్లో వెళ్తూ.. మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని తీశారు.. అయితే, ఆ కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టాడు.. ఇక, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. కానీ, ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మారిపోయింది.. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
-
AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
-
Crude Oil Prices Fall: ముడి చమురు ధరలపై గుడ్ న్యూస్.. బ్యారెల్ ధర 70 డాలర్లకు పడిపోవచ్చు..!
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!