Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
- ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే..
- తన తాత ఎన్టీఆర్.. తల్లిదండ్రులు చంద్రబాబు.. భువనేశ్వరి తనకు నేర్పించారు..
- అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తానన్న మంత్రి నారా లోకేష్.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని.. తన తాత ఎన్టీ రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని, అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శాస్త్రోత్తంగా పూజలు చేసి ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. బంగారు చీపురుతో వీధులను శుభ్రం చేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. అశేష భక్తజన సమూహం హాజరుకాగా.. ఇస్కాన్ టెంపుల్ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. మొదటగా పూజ నిర్వహించిన నారా లోకేష్.. జగన్నాథ స్వామికి పూజలు నిర్వహించి రథ యాత్రను ప్రారంభించారు.
Read Also: Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!
Also Read
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ఇక, ఆ తర్వాత భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్… ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని గుర్తుచేసుకున్నారు.. అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని భక్తుల సమక్షంలో ప్రకటించారు లోకేష్.. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి కృప కూడా ఉంటేనే తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలనని.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడానికి భగవంతుడు తన శక్తి సామర్థ్యం ఇవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుందని.. మంగళగిరిలో ప్రజలు తనకు ఇచ్చిన మెజారిటీకి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని.. మంగళగిరిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
తాజావార్తలు
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!