Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
- ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే..
- తన తాత ఎన్టీఆర్.. తల్లిదండ్రులు చంద్రబాబు.. భువనేశ్వరి తనకు నేర్పించారు..
- అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తానన్న మంత్రి నారా లోకేష్.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని.. తన తాత ఎన్టీ రామారావు, తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని, అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని అన్నారు మంత్రి నారా లోకేష్.. మంగళగిరి ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను శాస్త్రోత్తంగా పూజలు చేసి ప్రారంభించిన మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రి నారా లోకేష్.. బంగారు చీపురుతో వీధులను శుభ్రం చేస్తూ స్వామివారికి స్వాగతం పలికారు. అశేష భక్తజన సమూహం హాజరుకాగా.. ఇస్కాన్ టెంపుల్ పురవీధులలో స్వామివారిని ఊరేగించారు. మొదటగా పూజ నిర్వహించిన నారా లోకేష్.. జగన్నాథ స్వామికి పూజలు నిర్వహించి రథ యాత్రను ప్రారంభించారు.
Read Also: Anant ambani wedding: అనంత్-రాధిక పెళ్లికి హాజరుకానున్న ప్రధాని మోడీ!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఇక, ఆ తర్వాత భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్… ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లేనని తన తాత ఎన్టీ రామారావు, తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి తనకు చిన్నప్పుడు నుంచి నేర్పించారని గుర్తుచేసుకున్నారు.. అదే బాటలో తాను ప్రజాసేవనే దైవ సేవగా భావిస్తున్నానని భక్తుల సమక్షంలో ప్రకటించారు లోకేష్.. ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుడి కృప కూడా ఉంటేనే తాను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చగలనని.. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చడానికి భగవంతుడు తన శక్తి సామర్థ్యం ఇవ్వాలని నారా లోకేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుందని.. మంగళగిరిలో ప్రజలు తనకు ఇచ్చిన మెజారిటీకి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. తనపై మరింత బాధ్యత పెరిగిందని.. మంగళగిరిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!