Tirumala Prank Video: తిరుమల క్యూలైన్లో ప్రాంక్ వీడియో.. టీటీడీ సీరియస్
- తిరుమలలో ఆకతాయిల హల్చల్..
- క్యూలైన్ కాంప్లెక్స్లో ప్రాంక్ వీడియోలు..
- ప్రాంక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తమిళ యువకులు..
- ఆగ్రహం వ్యక్తం చేసిన టీటీడీ.. చట్టపరమైన చర్యలు ఉంటాయని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Prank Video: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలోనే ఆకతాయిలు హల్చల్ చేశారు.. నారాయణగిరి ఉద్యాణవనంలోని క్యూలైన్ కాంప్లెక్స్ల్లో ప్రాంక్ వీడియోలు తీసి.. భక్తులను గందరగోళానికి గురిచేశారు.. క్యూలైన్లలో ప్రాంక్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కొందరు తమిళ యువకులు.. కంపార్టుమెంట్ గేట్లు తెరుస్తున్నట్లు చేసి.. భక్తులతో పరిహాసాలు ఆడారు.. అయితే, ప్రాంక్ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది టీటీడీ.. ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయమైన చర్చగా పేర్కొన్న టీటీడీ.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.. తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా తీసిన ప్రాంక్ వీడియో హేయమైన చర్యగా పేర్కొన్న టీటీడీ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.
Read Also: Minister Nara Lokesh: ప్రజలకు సేవ చేస్తే భగవంతుడుకి చేసినట్టే.. అదే బాటలో సేవ చేస్తా..
Also Read
- Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
- 9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
- Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
కాగా, నారాయణగిరి షెడ్స్ లోని క్యూకాంపెక్స్లో వెళ్తూ.. మరో కంపార్టుమెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ప్రాంక్ వీడియోని తీశారు.. అయితే, ఆ కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్టుమెంట్ నుంచి వెకిలిగా నవ్వుతూ పరుగులు పెట్టాడు.. ఇక, ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రవేశించక ముందే భక్తులనుండి మొబైల్స్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. కానీ, ఒకరిద్దరు ఆకాతాయీలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మారిపోయింది.. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
-
Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్గా ఎలా మారింది?
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!