TTD Chairman: శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి శంకుస్థాపన చేసిన టీటీడీ ఛైర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Chairman: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆవరణలో శ్రీ బాలాజీ ఆంకాలజీ భవనానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజలు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేందుకు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టామన్నారు. 124 కోట్ల రూపాయలతో శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. ఈరోజు కీలకమైన బంకర్ బ్లాక్కు శంకుస్థాపన చేశామని.. రూ.200 కోట్ల రూపాయలతో అత్యధునిక యంత్రాలు , సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, టెస్టులు, పింక్ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు పింక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. చిత్తూరు, తిరుపతి జిల్లా నలుమూలలకు పింక్ బస్సులు పంపించి స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం 400 బెడ్స్ కెపాసిటీతో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, టీటీడీ పాలకమండలి సభ్యుడు పొకల అశోక్ కుమార్ పాల్గొన్నారు.
Read Also: Avinash Reddy: నేడు విచారణకు అవినాష్రెడ్డి బెయిల్ పిటిషన్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఇదిలా ఉండగా.. తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ఎలక్ట్రికల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఘాట్ రోడ్డులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. ఎలక్ట్రికల్ బస్సు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడామని ఆయన తెలిపారు. ప్రమాద ఘటనపై విచారణ చేపట్టామని, భవిష్యత్లో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. ఐరన్ క్రాస్ బార్స్ ఎత్తు పెంచుతామని, ఘాట్ రోడ్ పిట్ట గోడలు మరింత పటిష్టం చేస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
-
Vaibhav’s Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!