Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీన- మధ్యాష్టమిని నిర్వహించనున్నారు. 10వ తేదీన మతత్రయ ఏకాదశి, 13న మాస శివరాత్రి పండగలను వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Read Also: LEO : అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో జోరు మాములుగా లేదుగా..
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఇక, 14 వ తేదీన మహాలయ అమావాస్య పండగను టీటీడీ జరుపుతుంది. అదే రోజున రాత్రి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఆ తర్వాత వేదాంత దేశిక ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19వ తేదీన గరుడ సేవ, 20వ తారీఖు పుష్పక విమానం, సరస్వతి పూజ జరుపనున్నారు.
Read Also: KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్
అయితే, 21వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, 23న చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం పండగలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఇక, 24వ తేదీన పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25 తేదీన మతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం షెడ్యూల్ ను టీటీడీ రిలీజ్ చేసింది. అయితే, 28న పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం మహా సంప్రోక్షణ కార్యక్రమంతో ఆ శ్రీనివాసుడి ఆలయ వాకిళ్లను తెరుస్తారు. 31వ తేదీన చంద్రోదయో వ్రతం జరుపుతారు.
తాజావార్తలు
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్లాండ్లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?