Tirumala: తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ సంవత్సరం అధికమాసం వచ్చినందున రెండుసార్లు బ్రహ్మోత్సవాలను జరపాలని ఇప్పటి వరకే తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసింది. దీంతో పాటు నెల మొత్తంగా నిర్వహించబోయే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ విడుదల చేసింది. అక్టోబర్ 3వ తేదీన- మధ్యాష్టమిని నిర్వహించనున్నారు. 10వ తేదీన మతత్రయ ఏకాదశి, 13న మాస శివరాత్రి పండగలను వైభవంగా నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
Read Also: LEO : అడ్వాన్స్ బుకింగ్స్ లో లియో జోరు మాములుగా లేదుగా..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇక, 14 వ తేదీన మహాలయ అమావాస్య పండగను టీటీడీ జరుపుతుంది. అదే రోజున రాత్రి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఆ తర్వాత వేదాంత దేశిక ఉత్సవం నిర్వహిస్తారు. 15వ తేదీ నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. 19వ తేదీన గరుడ సేవ, 20వ తారీఖు పుష్పక విమానం, సరస్వతి పూజ జరుపనున్నారు.
Read Also: KTR: వ్యర్థాల వాహనాలు.. నేడు లబ్ధిదారులకు అందజేయనున్న మంత్రి కేటీఆర్
అయితే, 21వ తేదీన దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం కార్యక్రమాలను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, 23న చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం పండగలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఇక, 24వ తేదీన పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, 25 తేదీన మతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం షెడ్యూల్ ను టీటీడీ రిలీజ్ చేసింది. అయితే, 28న పాక్షిక చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకుని ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. అనంతరం మహా సంప్రోక్షణ కార్యక్రమంతో ఆ శ్రీనివాసుడి ఆలయ వాకిళ్లను తెరుస్తారు. 31వ తేదీన చంద్రోదయో వ్రతం జరుపుతారు.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!