TSUTF : పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద రెండేళ్ళుగా పెండింగులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ, పిఆర్సీ, డిఎ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. టిఎస్ యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బిల్లులు మంజూరు కాకపోవటం చేత ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ తరువాత రీవాలిడేషన్ లేదా తిరిగి సమర్పించాల్సి వచ్చిందని, ఈ నెలాఖరులోగా మంజూరు కాకపోతే మరలా అదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని టిఎస్ యుటిఎఫ్ హెచ్చరించింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, మూడు వాయిదాల డిఎ బకాయిలు విడుదల చేయాలని, పదోన్నతులు, బదిలీలకు గల ఆటంకాల తొలగింపుకు చొరవతీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్ కోరింది. ప్రభుత్వ స్థలాలు, సొమ్ముతో ప్రైవేటు యాజమాన్యంలో పబ్లిక్ పాఠశాలల ఏర్పాటు సరైంది కాదని ఇది విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని కనుక ఈ ఆలోచన విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. మోడల్ స్కూలు, గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నూతన నియామకాలకు ముందుగానే పూర్తి చేయాలని, ఆ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని, కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని సమావేశం కోరింది. మెగా డియస్సీ ప్రకటన, విద్యాకమీషన్ ఏర్పాటు, జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం నియామకాన్ని టిఎస్ యుటిఎఫ్ ఆహ్వానించింది. మార్చి 9,10 తేదీల్లో హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్న టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ వార్షిక విస్తృత సమావేశాల్లో రాష్ట్ర విద్యారంగం అభివృద్ది పై విస్తృతంగా చర్చించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, ఎ వెంకట్, ఇ గాలయ్య, డి సత్యానంద్, జి నాగమణి, బి రాజు, ఎస్ మల్లారెడ్డి, కె రవికుమార్, ఎస్ రవిప్రసాద్ గౌడ్, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, పి మాణిక్ రెడ్డి, మహబూబ్ అలీ పాల్గొన్నారు.
Also Read
- Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
తాజావార్తలు
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
-
Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!