TGSRTC : ఆర్టీసీ ఉద్యోగులకు యాజమాన్యం బహిరంగ లేఖ.. సమ్మె ఆలోచనను విరమించాలంటూ విజ్ఞప్తి
- అభివృద్ధి మార్గంలో ఉన్న సంస్థకు సమ్మె తీరని నష్టం
- ఉద్యోగుల సంక్షేమమే ప్రథమ లక్ష్యమని స్పష్టం చేసిన యాజమాన్యం
- ఎస్మా చట్టం ప్రకారం సమ్మెపై కఠిన చర్యల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC : తల్లి లాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తించి, సమ్మె నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగులకు బహిరంగ లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం సంస్థ అభివృద్ధి మార్గంలో పయనిస్తున్న సమయంలో సమ్మె అనేది తీరని నష్టానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంస్థ పూర్తిగా కట్టుబడి ఉంది. 2019లో జరిగిన సమ్మె సంస్థను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయగా, ఇప్పుడు ఉద్యోగుల సమిష్టి కృషితో ఆ కష్టాలను అధిగమించి ప్రజల్లో విశ్వాసం పొందుతోందని పేర్కొంది.
Land Allocation in Amaravati: అమరావతిలో ఏ సంస్థకు ఎంత భూమి..? తేల్చనున్న కేబినెట్ సబ్కమిటీ
Also Read
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
- Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
ఈ నేపథ్యంలో మరోసారి సమ్మెకు ప్రయత్నించడం సంస్థ భవిష్యత్తో పాటు ఉద్యోగుల భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందని లేఖలో హితవు పలికింది. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం సమ్మెలాంటి నిర్ణయాలను ప్రోత్సహించుతున్నారని, వారి మాటల ప్రభావంతో ఊగిపోవద్దని హెచ్చరించింది. ఆర్టీసీ యాజమాన్యం ఉద్యోగుల సంక్షేమాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటోందని స్పష్టం చేసింది. సంస్థకు వచ్చే ప్రతి రూపాయిని ఉద్యోగుల రాయితీలు, వేతనాలు, భద్రత కోసం వినియోగిస్తున్నట్లు వివరించింది.
అదే సమయంలో, ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధితమై ఉన్నాయని, సంస్థ నిబంధనల ప్రకారంగా సమ్మెలు చట్టవ్యతిరేకమని స్పష్టం చేసింది. సమ్మె పేరుతో ఇతర ఉద్యోగులను బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలు చట్టపరమైన ఫలితాలు తేవచ్చని హెచ్చరించింది.
తాజావార్తలు
-
India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
-
Sabari River Flood: పోలవరం జిల్లాలో శబరి నది ఉగ్రరూపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
-
Explainer: టార్గెట్ ఇండియా? పాక్కు బాంబులు పంపుతున్న టర్కీ!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!