Half Day Schools: తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకరోజు తరగతులు నిర్వహించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
Read Also:Prabhas: డార్లింగ్ ను తన కెమెరాలో బంధించిన లోఫర్ భామ..
ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్కూల్.. 12.30కి మధ్యాహ్న భోజనం.. 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూల్స్ లో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్ నడవనుంది. అయితే 10వ తరగతి కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం నుంచి తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ పాఠశాలల్లో ముందుగా మధ్యాహ్న భోజనం అందించి ఆ తర్వాత తరగతులు కొనసాగుతాయి. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత యథావిధిగా ఉదయం తరగతులు నిర్వహిస్తామని.. విద్యార్థుల పరీక్షల అనంతరం వేసవి సెలవులపై ప్రకటన చేస్తామని విద్యాశాఖ తెలిపింది.
Read Also:MP Midhun Reddy: ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించిన మిథున్రెడ్డి.. సీఎం ఆదేశాల మేరకే వచ్చాం..