Jaishankar: ట్రంప్-కమల హారిస్.. ఇద్దరిలో భారత్కు ఎవరు బెస్ట్.. జైశంకర్ సమాధానం..
- సమీపిస్తున్న అమెరికాలో అధ్యక్ష పోలింగ్ తేదీ
- అధ్యక్షులు ఎవరు అవుతారనే దానిపై ప్రపంచం దృష్టి
- తాజాగా ఈ అంశంపై స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్
- ఇద్దరిలో భారత్కు ఎవరు బెస్ట్ అనే దానికి సమాధానం చెప్పిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తోంది. ఈసారి అమెరికా అధ్యక్షుడు ఎవరు అవుతారనే దానిపై యావత్ ప్రపంచం దృష్టి ఉంది. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్తో తలపడుతున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్య్వూలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి ఓ ప్రశ్న అడిగారు. ట్రంప్ కమలా హారిస్లో ఎవరకు బెటర్.. భారత్కి ఎవరు మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. మనకెందుకులే అని జైశంకర్ నవ్వుతూ చెప్పారు. తాము ఈ అంశాన్ని నిర్ధారించామని.. తమకు ఎవ్వరు అధ్యక్షులైన పర్వాలేదని స్పష్టం చేశారు. క్లింటన్, బుష్, ఒబామా, ట్రంప్, బిడెన్ ఇలా ఐదుగురు వేర్వేరు అధ్యక్షులు వారి వ్యక్తిత్వం, రాజకీయాలు చూస్తే వీరంతా ఒకరికొకరు పూర్తి భిన్నంగా ఉన్నారని విదేశాంగ మంత్రి అన్నారు. కానీ భారతదేశంతో సంబంధాల విషయానికి వస్తే.. ప్రతి రాష్ట్రపతికి భారతదేశంతో బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈరోజుకీ రెండు దేశాల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని, ఎవరు అధ్యక్షుడైనా మన వ్యూహం ఇలాగే ఉండాలని చూస్తున్నామన్నారు.
Also Read
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Nellore: వివాహేతర సంబంధం.. నిండు ప్రాణం బలి.!
- Kolkata Airport Mosque: ముగ్గురు సీఎంలు టచ్ చేయలేకపోయారు.. సువేందు రాకతో ఎయిర్పోర్టు మసీదు తరలింపు.!
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
ఇదిలా ఉండగా.. అమెరికాలో నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు జరుగుతోంది. ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అక్కడి ఎన్నికల అధికారులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటి వద్ద నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వరకు వెళ్లే అవసరం లేకుండా బ్యాలెట్ బాక్సునే ఓటరు వద్దకు తీసుకువెళ్తున్నారు. ఇందుకోసం మొబైల్ ఓటింగ్ వ్యాన్ సదుపాయాన్ని కల్పించారు. తొలిసారి పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మోంట్ గోమేరీ కౌంటీలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?