Trump: ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్.. పుతిన్ ఏమన్నారంటే?
- ఉక్రేనియన్ సైనికుల ప్రాణాలను కాపాడమని విజ్ఞప్తి చేసిన ట్రంప్
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు చూడని భయంకరమైన మారణహోమం
- ట్రంప్ పిలుపుకు మేము సానుకూలంగా ఉన్నామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న పరస్పర దాడులు రెండో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఇరు దేశాల దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వందల భవనాలు నెలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు విజ్ఞప్తి చేశాడు. వేలాది మంది ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలను కాపాడాలని ట్రంప్ పుతిన్కు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ దళాలు పూర్తిగా చుట్టుముట్టబడ్డాయని ట్రంప్ తెలిపాడు. యుద్ధంతో ఉక్రెయిన్ చితికి పోయిందని కనికరం చూపాలని ట్రంప్ కోరాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంతవరకు చూడని భయంకరమైన మారణహోమం అవుతుందన్నారు.
Also Read:Mega Star : ‘తమ్ముడు’ స్పీచ్ కు ‘అన్నయ్య’ ఎమోషనల్..
Also Read
- Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
- Vaibhav Sooryavanshi: "ఫుడ్ విషయంలో తగ్గేదేలే".. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
రష్యా సైనిక దాడి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుర్స్క్ ప్రాంతంలోని ఉక్రేనియన్ దళాలను లొంగిపోవాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సైనికులు లొంగిపోతే వారు బతికే ఉంటారని రష్యా అధ్యక్షుడు అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పిలుపుకు మేము సానుకూలంగా ఉన్నామని పుతిన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉక్రేనియన్లు లొంగిపోయి ఆయుధాలు వదిలివేస్తే, వారు జీవించడానికి, గౌరవంగా చూసుకోవడానికి హామీ ఇస్తామని పుతిన్ అన్నారు. అమెరికా అధ్యక్షుడి పిలుపును సమర్థవంతంగా అమలు చేయడానికి, ఉక్రెయిన్ సైనిక-రాజకీయ నాయకత్వం తన దళాలను ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని ఆదేశించాలని పుతిన్ అన్నారు.
Also Read:Pawan Kalyan : ఉత్తర భారత్, దక్షిణ భారత్ గా విడగొట్టద్దుః పవన్ కల్యాణ్
రష్యా గత వారం రోజులుగా కుర్స్క్లో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న పెద్ద భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. గత ఏడాది ఆగస్టులో ఉక్రేనియన్ సైన్యం ఆకస్మిక దాడి చేసి కుర్స్క్లోని ఒక పెద్ద ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. సుదీర్ఘ యుద్ధం తర్వాత కూడా, రష్యన్ సైన్యం మొత్తం ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోలేకపోయింది. అయితే, గత నెల చివర్లో వైట్ హౌస్లో జరిగిన వివాదం తర్వాత ట్రంప్ అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేసిన తర్వాత ఉక్రెయిన్ సైన్యం ఒత్తిడిలో పడింది.
తాజావార్తలు
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
-
Box Office Numbers: బాక్సాఫీస్ పోస్టర్లపై నాగవంశీ కామెంట్స్ వైరల్.. ‘ఇప్పటికీ నంబర్లు ఇన్ఫ్లేట్ అవుతున్నాయి’!
-
Best AI Laptops 2026: AI ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్టాప్లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!