మహబూబ్ నగర్ సీసీ కుంట మండలం ఫర్దిపూర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపింది. ఉజ్జయిని పుణ్య క్షేత్ర దర్శనానికి వెళ్తుండగా తుఫాన్ ను ట్రక్కు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు నర్సింహా (28), శివ (26) మృతి. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. బాధితులంతా ఫర్దిపూర్ గ్రామస్థులే అని అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.