తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు: కడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యవసాయరంగానకిప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ర్ట ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి బీజే పీ నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కును బీజేపీ కోల్పోయిందన్నారు. పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) ని ధాన్యం కొనకుండా ఆదేశాలు జారీ చేస్తు అటూ సంస్థను, ఇటు రైతులను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ధనిక పారిశ్రా మిక వేత్తలకు రుణాల మాఫీ చేశారు. కానీ రైతులను ఎనాడు పట్టించు కోలేదన్నారు. వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ఏడాది కాలంగా రైతు లను హింస పెట్టారన్నారు. 600 మంది రైతుల బలి దానాల తర్వాత రైతు చట్టాల ఉపసంహారణ రైతుల మీద ప్రేమతో చేశారా లేదా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు పంజాబ్లో కొన్నట్టు తెలంగాణలో ధాన్యం ఎందుకు కొనరని ఆయన మండిపడ్డారు. రాష్ర్ట బీజేపీ నేతలకు కేంద్రం దగ్గరికి వెళ్లి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకొచ్చే దమ్ము లేదన్నారు.
ఇప్పటికైనా కేంద్రం ధాన్యం ఎంత కొంటారో చెప్పాలని, తెలంగాణ రైతులను ఇబ్బందుల పాలు చేయోద్దని ఆయన హితవు పలికారు. రైతుల మీద చిత్త శుద్ధి ఉంటే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని కడియం శ్రీహరి అన్నారు. రైతు పంటల ఫసల్భీమా పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతుందన్నారు. ఆ డబ్బులు సకాలంలో రాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. రైతులపై ప్రేమ ఉంటే వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!