మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన ముగ్గురిని దుండగులు కాల్చిచంపారు. శుక్రవారం (ఆగస్టు 18) తెల్లవారుజామున 4.30 గంటలకు కుకి ప్రజలు నివసించే తోవాయి కుకి గ్రామ శివారులోని గుట్టల మటు నుంచి కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మణిపూర్లో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనలో కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతి చెందినట్లు ఉఖ్రుల్ జిల్లా పోలీసు అధికారి ఎన్. వాషుమ్ అన్నారు.
Read Also: Wildfire: హవాయి దాటి వాషింగ్టన్ వైపు కార్చిచ్చు
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. కొండ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ను మోహరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి తప్పిన పెను ప్రమాదం..
మరోవైపు కేంద్రం జోక్యం చేసుకుని కుకీ తెగకు చెందిన ముగ్గురు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని మహిళా నిరసనకారులు తెలిపారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో వివాదాస్పద సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (AFSPA)ని వీలైనంత త్వరగా తిరిగి అమలు చేయాలని కోరారు. మణిపూర్లోని అన్ని లోయ జిల్లాల్లో కొండ జిల్లాల తరహాలో AFSPAని మళ్లీ అమలు చేయాలని ఆదివాసీ ఏక్తా కమిటీ (COTU) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. భారత స్వాతంత్ర్య దినోత్సవం నాడు మణిపూర్ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. మునుపటి ఘటనలు మరచిపోండి, శాంతియుతంగా జీవించండి అని పిలుపునిచ్చారు. అయితే రెండు రోజుల తరువాత నిరసనకారులు ముగ్గురు వ్యక్తులను చంపడం మళ్లీ హింసకు దారితీసింది.