Atchannaidu: పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు
- పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు - మంత్రి అచ్చెన్నాయుడు
- మార్కెటింగ్ శాఖ.. సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు- అచ్చెన్నాయుడు
- గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
రాష్ట్రంలో ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలియచేశారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆద్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడంతో పాటు ఆన్లైన్ కొనుగోలు విధానం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు.. సీసీ కెమేరాల ఏర్పాటు, బీమా సదుపాయం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. పత్తి సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చామని, రైతుల ప్రయోజనం కోసం సాయంత్రం 6 గంటల వరకు అంటే అదనంగా ఒక గంట గ్రేస్ పిరియడ్ గా కేటాయించామన్నారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మర్కెటింగ్, వ్యవసాయ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
-
Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
-
Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
-
Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
-
Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!