Atchannaidu: పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు
- పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు - మంత్రి అచ్చెన్నాయుడు
- మార్కెటింగ్ శాఖ.. సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు- అచ్చెన్నాయుడు
- గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read
- Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
- Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
- Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
- BLA Attack: పాక్ సైన్యంపై BLA మెరుపుదాడి.. 25 మంది సైనికులు హతం..
రాష్ట్రంలో ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలియచేశారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆద్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడంతో పాటు ఆన్లైన్ కొనుగోలు విధానం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు.. సీసీ కెమేరాల ఏర్పాటు, బీమా సదుపాయం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. పత్తి సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చామని, రైతుల ప్రయోజనం కోసం సాయంత్రం 6 గంటల వరకు అంటే అదనంగా ఒక గంట గ్రేస్ పిరియడ్ గా కేటాయించామన్నారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మర్కెటింగ్, వ్యవసాయ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: రూ.100 కోట్లతో ‘‘హనుమాన్ అంశ్’’ వసూళ్ల సునామీ.. ఆ రాష్ట్రంలో ట్యాక్స్ ఫ్రీ..
-
Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు తీపి కబురు.. 2029లోపు మరో మూడు డీఎస్సీలు..
-
Padi Kaushik Roddy : ఎథిక్స్ కమిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లేఖ
-
Putin: యుద్ధంలో కీలక పరిణామం.. 3 రోజులు ఉక్రెయిన్పై దాడులు చేయబోమన్న పుతిన్
-
Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ ‘కామ్రేడ్ కళ్యాణ్’!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!