Atchannaidu: పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు.. మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు
- పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు - మంత్రి అచ్చెన్నాయుడు
- మార్కెటింగ్ శాఖ.. సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
- పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు- అచ్చెన్నాయుడు
- గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
రాష్ట్రంలో ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలియచేశారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆద్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడంతో పాటు ఆన్లైన్ కొనుగోలు విధానం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు.. సీసీ కెమేరాల ఏర్పాటు, బీమా సదుపాయం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. పత్తి సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చామని, రైతుల ప్రయోజనం కోసం సాయంత్రం 6 గంటల వరకు అంటే అదనంగా ఒక గంట గ్రేస్ పిరియడ్ గా కేటాయించామన్నారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మర్కెటింగ్, వ్యవసాయ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!