Vizag Capital: విశాఖ నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు.. నేడు సీఎం జగన్కు నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Capital: విశాఖపట్నం నుంచి పాలన దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. దీనికి సంబంధించి విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ కమిటీ నివేదిక సిద్ధం చేసింది.. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ నివేదిక సమర్పించనుంది కమిటీ.. విశాఖలో ట్రాన్సిట్ అకామిడేషన్ పరిశీలనకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న నియమించిన విషయం విదితమే కాగా.. విశాఖలో పర్యటించిన త్రిసభ్య కమిటీ.. తాత్కాలిక కార్యాలయాల కోసం అనువైన భవనాలను పరిశీలించింది.. దీనిపై నివేదిక సిద్ధం చేసింది.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్ను కలిసి నివేదిక సమర్పించనుంది ఆ కమిటీ..
Read Also: Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
కాగా, విశాఖ నుంచి పాలన సాగించేందుకు సిద్ధమైన వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సీనియర్ కార్యకర్తలకు వసతి సహా విశాఖపట్నంలో అనువైన రవాణా వసతిని గుర్తించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ (MA & UD డిపార్ట్మెంట్), స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్ డిపార్ట్మెంట్) మరియు సెక్రటరీ (సర్వీసెస్ & హెచ్ఆర్ఎం), జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, కార్యాలయాలకు అనువైన రవాణా వసతిని గుర్తించి, నివేదికను సిద్ధం చేసింది.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామంటూ.. తాను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతానంటూ సీఎం వైఎస్ జగన్ చెబుతూ వస్తున్నారు.. మంత్రులు కూడా ఇదే మాట పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.. కానీ, అది కాస్త ఆలస్యం అవుతూ రాగా.. ఇప్పుడు నివేదిక పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. కాగా, వైఎస్ జగన్ సర్కా్ర్ విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసనసభ రాజధానిగా నిర్ణయించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..