Maoists : 30 ఏళ్ల అజ్ఞాతానికి ముగింపు.. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
- మంచిర్యాల జిల్లా నేత లచ్చన్న 30 ఏళ్ల అజ్ఞాతం తర్వాత లొంగింపు
- అనారోగ్యంతో మావోయిస్టు పార్టిని వీడిన ఇద్దరు కీలక నేతలు
- లొంగించిన వారికి ప్రభుత్వ పునరావాస హామీ: కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ అజ్ఞాత జీవితం గడిపారు. ముఖ్యంగా లచ్చన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని పారుపల్లి గ్రామానికి చెందినవారు.
Also Read
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
పార్టీ లోపలున్న అనేక విభేదాలు, ఆరోగ్య సమస్యలు, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒడిదుడుకుల జీవితాన్ని కొనసాగించడం కష్టంగా మారటంతో ఈ నేతలు రహస్య అజెండాను విడిచి ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున లచ్చన్నకు రూ.20 లక్షలు, అంకూభాయ్కు రూ.5 లక్షలు నగదుగా బహుమతిగా అందజేశారు. వీరి లొంగింపు మావోయిస్టు ఉద్యమానికి మరో తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు.
లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం, భద్రతతో పాటు జీవనోపాధి కల్పనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ విధానాల ప్రకారం ఈ దంపతుల పునర్వాస ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఈ లొంగింపు ఘటనతో మావోయిస్టు ఉద్యమ బలహీనపడుతున్న సంకేతాలే తెలుస్తున్నాయి. అటు పోలీసుల వ్యూహాత్మక చర్యలు, ఇటు ప్రభుత్వ పునరావాస పథకాలు ప్రభావితం చేస్తున్నట్లు నిపుణుల అభిప్రాయం.
Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
తాజావార్తలు
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
-
Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
-
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!