Maoists : 30 ఏళ్ల అజ్ఞాతానికి ముగింపు.. పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
- మంచిర్యాల జిల్లా నేత లచ్చన్న 30 ఏళ్ల అజ్ఞాతం తర్వాత లొంగింపు
- అనారోగ్యంతో మావోయిస్టు పార్టిని వీడిన ఇద్దరు కీలక నేతలు
- లొంగించిన వారికి ప్రభుత్వ పునరావాస హామీ: కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ అజ్ఞాత జీవితం గడిపారు. ముఖ్యంగా లచ్చన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని పారుపల్లి గ్రామానికి చెందినవారు.
Also Read
పార్టీ లోపలున్న అనేక విభేదాలు, ఆరోగ్య సమస్యలు, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఒడిదుడుకుల జీవితాన్ని కొనసాగించడం కష్టంగా మారటంతో ఈ నేతలు రహస్య అజెండాను విడిచి ప్రభుత్వానికి లొంగిపోయినట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున లచ్చన్నకు రూ.20 లక్షలు, అంకూభాయ్కు రూ.5 లక్షలు నగదుగా బహుమతిగా అందజేశారు. వీరి లొంగింపు మావోయిస్టు ఉద్యమానికి మరో తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు.
లొంగిపోయినవారికి ప్రభుత్వం పునరావాసం, భద్రతతో పాటు జీవనోపాధి కల్పనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ విధానాల ప్రకారం ఈ దంపతుల పునర్వాస ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఈ లొంగింపు ఘటనతో మావోయిస్టు ఉద్యమ బలహీనపడుతున్న సంకేతాలే తెలుస్తున్నాయి. అటు పోలీసుల వ్యూహాత్మక చర్యలు, ఇటు ప్రభుత్వ పునరావాస పథకాలు ప్రభావితం చేస్తున్నట్లు నిపుణుల అభిప్రాయం.
Lowest total in Tests: టెస్టుల్లో అత్యల్ప స్కోర్ చేసిన చేసిన జట్లు ఇవే..!
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!