Ganesh Immersion: వినాయక నిమజ్జనంలో అపశృతి.. ఇద్దరు యువకులు, ఓ బాలుడు గల్లంతు
- వినాయక నిమజ్జనంలో అపశృతి
- వియన్పల్లి మండలంలోని మొగమూరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతు
- నంద్యాల జిల్లాలో తెలుగు గంగ కాలువలో ఓ బాలుడు గల్లంతు
Ganesh Immersion: కడప జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. వియన్పల్లి మండలంలోని మొగమూరు వాగులో వినాయక నిమజ్జనంలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇద్దరు యువకులు వాగులో గల్లంతు కావడంలో వారి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
Read Also: Tragedy: బుడమేరులో శవమై తేలిన రియల్ ఎస్టేట్ వ్యాపారి
Also Read
ఇదిలా ఉండగా.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వినాయక నిమజ్జనంలో మరో ఘటన చోటుచేసుకుంది. వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు తెలుగు గంగ కాలువ వద్దకు నలుగురు బాలురు వెళ్లారు. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా అదుపుతప్పి కాలువలో నలుగురు జారిపడ్డారు. వీరిలో ముగ్గురిని టోల్గేట్ సిబ్బంది రక్షించగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. దస్తగిరి కుమారుడూ లాల్ భాషా(12) గల్లంతైనట్లు తెలిసింది. కాల్వకట్ట వెంబడి లాల్ బాషా ఆచూకీ కోసం పోలీసులు, గ్రామస్థులు గాలిస్తున్నారు. ఇంకా అతడి ఆచూకీ తెలియరాలేదని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో