Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ లో వినోదాన్ని పంచుతూ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఉప్పలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఇప్పటికే ఏప్రిల్ 2న ఇదే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.. అదే.. ఇక మన హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ భాగ్యనగరంలో మరో మ్యాచ్ జరుగనుంది. దీంతో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
Also Read : IPL 2023 : సన్ “రైజ్” అవుతుందా.. హ్యాట్రిక్ పై పంజాబ్ నజర్
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇవాళ సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదరిపై వచ్చే వాహనాలను చెంగిచర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్ఎఫ్సీ వైపు మళ్లీస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ నుంచి వచ్చే విహనాలను హెచ్ఎండీఏ లే అవుట్ బోడుప్పల్, చెంగిచర్ల చౌరస్తా వైపు.. మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లీంచనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read : Drunk and Drive: ఓరేయ్ ఆజాము లగెత్తండ్రోయ్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు తమ వెంట ఎటువంటి వస్తువులు తీసుకురావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు అందిస్తున్నామని రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న సీపీ చౌహన్.. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని తెలిపాడు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియం పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. అదేవిధంగా బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీపీ చౌహాన్ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందన్న ఆయన.. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. దీంతో పాటు అటు మెట్రో సర్వీసులను కూడా పొడించారు.

తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!