Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ లో వినోదాన్ని పంచుతూ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా నేడు ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. ఉప్పలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం మరోసారి వేదిక కానుంది. ఇప్పటికే ఏప్రిల్ 2న ఇదే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు.. అదే.. ఇక మన హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుందంటే క్రికెట్ ఫ్యాన్స్ చేసే హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇవాళ భాగ్యనగరంలో మరో మ్యాచ్ జరుగనుంది. దీంతో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.
Also Read : IPL 2023 : సన్ “రైజ్” అవుతుందా.. హ్యాట్రిక్ పై పంజాబ్ నజర్
Also Read
- Ketan Agarwal Case: 'పెళ్లి నుంచి తప్పించుకోలేవు'.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
- Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
ఇవాళ సాయంత్రం సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదరిపై వచ్చే వాహనాలను చెంగిచర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్ఎఫ్సీ వైపు మళ్లీస్తున్నారు. అలాగే ఎల్బీనగర్ నుంచి వచ్చే విహనాలను హెచ్ఎండీఏ లే అవుట్ బోడుప్పల్, చెంగిచర్ల చౌరస్తా వైపు.. మల్లాపూర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లీంచనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read : Drunk and Drive: ఓరేయ్ ఆజాము లగెత్తండ్రోయ్.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు తమ వెంట ఎటువంటి వస్తువులు తీసుకురావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు అందిస్తున్నామని రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్న సీపీ చౌహన్.. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని తెలిపాడు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియం పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. అదేవిధంగా బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని సీపీ చౌహాన్ హెచ్చరించారు. టికెట్ల పంపిణీ పారదర్శకంగా జరుగుతుందన్న ఆయన.. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది. దీంతో పాటు అటు మెట్రో సర్వీసులను కూడా పొడించారు.

తాజావార్తలు
-
Ketan Agarwal Case: ‘పెళ్లి నుంచి తప్పించుకోలేవు’.. కేతన్పై సియా గోయల్ సంచలన ఆరోపణ
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
-
OPEC: యూఏఈ బాటలో ఇరాక్.. ఒపెక్లో సౌదీ అరేబియా ఆధిపత్యానికి సవాల్..
-
Stainless Steel Railing Cleaning Tips: ఖరీదైన క్లీనర్లు కొనక్కర్లేదు.. ఇంట్లోనే స్టీల్ రెయిలింగ్లను మెరిపించే సీక్రెట్స్..
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయం వెండి ఇటుకలు మాయమయ్యాయా? సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!