Revanth Reddy : తెలంగాణ మోడల్ అంటే కమీషన్లు.. కాంటాక్ట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన ఆర్మీ జవాన్ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల వారికి ఇచ్చే ప్రాధాన్యత తెలంగాణ వారికి ఇవ్వరా అని ఆయన మండిపడ్డారు. ఇతర రాష్ర్టాలలో పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ, పంజాబ్, బీహార్ రాష్ర్టాలకు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ మోడల్ అంటే కమీషన్లు..కాంటాక్ట్లు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
- PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
- Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
- Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
గుజరాత్ మోడల్ అంటే మత విద్వేషాలు, ఆస్తులు విధ్వంసం చేయడమేనని ఆరోపించారు. ఇలాంటి మోడల్ తెలంగాణలో తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని, సందట్లో సడేమియాలా గులాంనబీ ఆజాద్ మోడీకి గులాంగా మారారంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని.. గులాంనబీ అజాద్ కాంగ్రెస్ను నిందిస్తున్నారని, రాజ్యసభ రెన్యూవల్ కాలేదని.. పార్టీ వీడారంటూ ఆయన వ్యాఖ్యానించారు. గుజరాత్లో జరిగిన నరమేథం ఆజాద్ మర్చిపోయారా.. అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ చేతిలో ఆజాద్ కీలుబోమ్మలాగ మారారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు.
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం