Addanki Dayakar: రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉంది: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు
- రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరిగింది
- దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారింది.
- జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ వివిధ అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక బాధ్యతగా తీసుకుంటుందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన బీజేపీ వైఖరిపై ఘాటు విమర్శలు చేశారు. 2029లో దేశంలో పూర్తిస్థాయి అధికారంలోకి రావడానికి బీజేపీ నార్త్, సౌత్లో రాజకీయ కుట్రలు పన్నుతోందని దయాకర్ ఆరోపించారు. జెమిలి ఎన్నికలతో ప్రయోగాలు చేయడం కూడా బీజేపీ రాజకీయ ప్రేరేపిత కుట్రలలో భాగమని పేర్కొన్నారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులను శత్రుత్వంగా చూడడం బీజేపీకి ఆనవాయితీగా మారిందని, ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్యల వైపు అడుగులే అని వ్యాఖ్యానించారు.
Also Read: Robbery Case: అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో కీలక పురోగతి
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
భారతదేశానికి శత్రువులుగా ఉన్న ఇతర దేశాలతో బీజేపీ ప్రేమగా ఉంటుందని, ఇది ఆ పార్టీ సామ్రాజ్యవాద దృక్పథానికి నిదర్శనమని దయాకర్ విమర్శించారు. బీజేపీ తన రాజకీయ మిత్రులతో సంబంధాలను కొనసాగిస్తూ, తన స్వలాభం కోసం మిత్రపక్షాలను ఎదురుదాడికి గురిచేయడం ఆ పార్టీ నైజమని స్పష్టమయ్యిందన్నారు. ఆపై ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వ్యూహాలను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుతో కయ్యం బీజేపీకి ప్రమాదకరమని తెలుసు కానీ, పవన్ కళ్యాణ్ను ముందు పెట్టి తన ఆధిపత్యాన్ని చెలాయించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. తన రాజకీయ మిత్రులను ఉపయోగించి, అదే పార్టీని అంతమొందించడమే బీజేపీ అసలు లక్ష్యమని దయాకర్ వ్యాఖ్యానించారు. మొత్తానికి భారత రాజ్యాంగ పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యతను దయాకర్ ప్రస్తావించారు. రాహుల్ గాంధీని దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షకుడిగా చూసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటుందని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!