TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!
- కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను మోసం చెయ్యదు
- జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాము
- ఫిబ్రవరి రెండో వారంలో రాహుల్ గాంధీ సభ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ‘జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాం. మేయర్ పీఠం గెలుచుకోవాలని ప్లానింగ్ చేశాం. కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేని ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశంకి బీజేపీ వాళ్లు బిక్షాటన చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది. కుల సర్వే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలు తమకు నష్టం జరుగుతుందని అనేక కుట్రలు చేశాయి. ఫిబ్రవరి 5న ఉప సంఘం కేబినెట్ నివేదిక ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్లో నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
‘స్పీకర్ ఉద్దేశం డబ్బులు లేవని కాదు. అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయడం అంటూ ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపై ఇప్పటికే కసరత్తు జరిగింది. ఢిల్లీకి పేర్లు పంపించాము. ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు, అందులో తప్పేంటి?. సచివాలయం కూల్చి మరలా కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. పటాన్ చెరుపై కమిటీ నివేదిక ఇంకా రాలేదు. ఎమ్మెల్యే కమిటీ ముందుకు రావాల్సి ఉంది. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం జరుగుతుంది’ అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!