TPCC Chief: హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయము!
- కాంగ్రెస్ ప్రభుత్వం జనాలను మోసం చెయ్యదు
- జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాము
- ఫిబ్రవరి రెండో వారంలో రాహుల్ గాంధీ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మాత్రం మోసం చేయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుందని స్పష్టం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉద్దేశం డబ్బులు లేవని కాదని, అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుందన్నారు. జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నామని, మేయర్ పీఠం గెలుచుకుంటామని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… ‘జీహెచ్ఎంసీపై ఫోకస్ చేస్తున్నాం. మేయర్ పీఠం గెలుచుకోవాలని ప్లానింగ్ చేశాం. కేంద్రం నుండి రూపాయి నిధులు ఇవ్వలేని ఇద్దరు బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ సమావేశంకి బీజేపీ వాళ్లు బిక్షాటన చేస్తూ రావడం విడ్డూరంగా ఉంది. కుల సర్వే జరిగితే బీఆర్ఎస్, బీజేపీలు తమకు నష్టం జరుగుతుందని అనేక కుట్రలు చేశాయి. ఫిబ్రవరి 5న ఉప సంఘం కేబినెట్ నివేదిక ఇస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు కేబినెట్లో నిర్ణయిస్తారు’ అని చెప్పారు.
Also Read
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
‘స్పీకర్ ఉద్దేశం డబ్బులు లేవని కాదు. అధికారుల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. హామీల అమలుకు కొంత ఆలస్యం కావచ్చు కానీ.. ప్రజల్ని మోసం చేయడం అంటూ ఉండదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాల అమలు ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరుపై ఇప్పటికే కసరత్తు జరిగింది. ఢిల్లీకి పేర్లు పంపించాము. ఏఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. సమయాన్ని బట్టి సీఎం ఇంటి దగ్గర సమీక్ష చేస్తారు, అందులో తప్పేంటి?. సచివాలయం కూల్చి మరలా కట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. ఫిబ్రవరి రెండో వారంలో సూర్యాపేట జిల్లాలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. పటాన్ చెరుపై కమిటీ నివేదిక ఇంకా రాలేదు. ఎమ్మెల్యే కమిటీ ముందుకు రావాల్సి ఉంది. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం జరుగుతుంది’ అని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!