Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tpcc Chief Mahesh Kumar Goud Party Strength Future Plans

Mahesh Kumar Goud : కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి

Published Date :October 26, 2024 , 9:44 pm
By Gogikar Sai Krishna
  • కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు ఉంటాయి
  • కొందరు ఎమ్మెల్యేలు.. ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం
  • కేటీఆర్‌తో ఉన్నవారు.. మాతో టచ్‌లో ఉన్నారు
  • ఫోన్‌ ట్యాపింగ్‌ తీవ్రమైన కేసు
  • డ్రగ్స్‌ విషయంలో ఎవర్ని వదలం : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌
Mahesh Kumar Goud : కేటీఆర్‌తో ఉన్నవారు మాతో టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్‌లో చేరికలు ఉంటాయి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mahesh Kumar Goud : ప్రభుత్వం ఉన్న చోటే పార్టీ బలంగా ఉండాలని హైకమాండ్ చెప్పిందని టీపీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్‌ తెలిపారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం పై, పార్టీ ముఖ్యనేతలతో విస్తృత చర్చ జరగాలని, ఆచితూచి కమిటీ వెయ్యాల్సిన అవసరం ఉంది. సమర్థులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తాం అని మహేష్ గౌడ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణ నాపరిధిలోది కాదు , సీఎం, ఏఐసీసీలు కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. నవంబర్ చివరి నాటికి తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ విస్తరణ ఉండొచ్చన్నారు. సమర్ధులను జిల్లా అధ్యక్షులుగా నియమిస్తామని ఆయన తెలిపారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులుగా అవకాశం ఇస్తామని, కొత్త వాళ్ళు వచ్చిన చోట వాళ్ళను గౌరవించుకోవాలన్నారు. పాత కొత్త కలయిక తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని ఆయన అన్నారు. కొత్త పాత నాయకులను మిక్స్ చేయాలని, కాంగ్రెస్ లో చేరికలు ఉంటాయన్నారు. చాలా మంది ఎమ్మెల్సేలు, ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని, కేటీఆర్ తో రోజు ఇన్ అండ్ అవుట్ టచ్ లో ఉన్న వాళ్ళు.. మాతో టచ్ లో ఉన్నారన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. ప్రభుత్వాన్ని కూలుస్తాం అని అన్నారు.. అందుకే చేరకలు జరిగాయని, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందన్నారు మహేష్ కుమార్‌.

అంతేకాకుండా..’మాకు ఫైనల్ ఎన్నికలు 2028 లో ..రాష్ట్రంలో కాంగ్రెస్.. దేశంలో కాంగ్రెస్ గెలవాలి.. రాహుల్ పీఎం కావాలి.. బీసీ గణన పై కామన్ మ్యాన్ లా రిపోర్ట్ కావాలి.. రాహుల్ గాంధీ కూడా సీరియస్ గా ఉన్నారు.. తెలంగాణాలో బీసీ గణనపై కన్వెన్షన్. బీసీ గణన సదస్సుకు రాహూల్ , ఖర్గేలు హాజరవుతారు. బీసీ కుల గణన పై రాహుల్ లైన్ లోనే సిఎం, నేను ఉన్నాం. కులగణన జరిగితే ఎవరి వాటా వాళ్ళకే వస్తది. మల్లన్న తో మాట్లాడాను.. బీసీలకు న్యాయం కోసం పార్టీ పై కొన్ని అంశాల్లో డివేట్ అవుతున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను ఇష్టారాజ్యంగా వాడుతోంది. సోషల్ మీడియాను అనైతికంగా ఉపయోగిస్తున్నారు.
హైడ్రా, మూసీ విషయంలో ప్రజలను రెచ్చగొట్టేలా పోస్లులు పెడ్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో మిస్ లీడ్ చేస్తున్నారు.. దుబాయ్.. సింగపూర్ నుంచి సోషల్ మీడియాను హ్యాండిల్ చేస్తున్నారు.

Also Read

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!
  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

పొంగులేటి ఏ బాంబు పేలుస్తారో చూడాలి. విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డ అధికారులపై చర్యలు కోసం జనం చూస్తున్నారు. కేటీఆర్ కు రెండేళ్లు కాదు.. పదేళ్ల శిక్ష పడే తప్పులున్నాయి. కాళేశ్వరం అంత ఖర్చు పెట్టి కట్టింది.. కమిషన్ల కోసమే.. అన్యాయంగా ఎవర్ని శిక్షంచం.. తప్పు చేసిన వాళ్లకు మాత్రం శిక్షపడాలి. విద్యుత్ అప్పటి కంటే చాలా తక్కువ ధరకు కొంటున్నం. విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయి. కేసీఆర్ కు ఉన్న ఆర్థిక వెసలుబాటు మాకు లేదు. ఆర్థికంగా నిర్వుండం ఉంది.. వచ్చే అధ్యాయంలో వడ్డిలకే ఎక్కువ కట్టాల్సి వస్తోంది. కేసీఆర్ లాగా మోసం చెయ్యాం.. ఇచ్చిన హామీలు అమలు చేస్తాం.. జీవన్ రెడ్డి నరనరాన కాంగ్రెస్ భావజాలమే ఉంది. జీవన్ రెడ్డి తన అనుచరుడి మర్డర్ తర్వాత ఆవేదనకు గురయ్యారు. జీవన్ రెడ్డి ఒంటరి కాదు మేమంతా ఆయన వెంట ఉన్నాం. 13 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బి ఫాం ఇచ్చింది. కొడంగల్ చేరికలపై.. బీఆర్ఎస్‌లో ఏముందని చేరతారు.. వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదు..

కడుపు మండి సురేఖ అలా మాట్టాడారు.. వెంటనే వెనక్కి తీసుకున్నారు.. ముగిసిన అధ్యాయం.. మూసీ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు అని ఎవరు చెప్పారు.. కావాలని అబద్దపు ప్రచారం చేస్తున్నారు.. నెహ్రూ తర్వాత విజన్ తో అభివృద్ధి చేసింది నిజాం.. గత పదేళ్లలో 1500 చెరువుల్లో కబ్జా జరిగింది.. పెద్ద ప్రళయం వస్తె జనం ఇబ్బంది పడతారు.. అందుకే మూసి నీ యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు.. పెద్దవాళ్ళకు నష్టం జరక్కుండా ఉండాలనేది మా ఆలోచన.. సీఎం స్టడీ చేస్తున్నారు.. హైడ్రా, మూసీ విషయంలో ప్రతిపక్షాల రాద్దాంతం చేస్తున్నాయి.. పెద్దవాళ్ళకు అన్యాయం జరక్కుండా కచ్చితంగా.. ప్రాజెక్టులు ముందుకు పోతాయి..
కచ్చితంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు వెళ్తాం.. కాంగ్రెస్ లో ప్రజాస్వామిక స్వేచ్చ ఉంటుంది.. ఎన్విరాన్మెంట్ అంశం పెట్టుబడులపై ప్రభావం చూపెడుతుంది.. మాదృష్టికి వచ్చిన అన్ని సమస్యలపై చర్చిస్తున్నాం.. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ఉన్నాడు.. వర్షాలు. రైతుల కష్టాలు రాలేదు ఫాం హౌస్ కి పరిమితం..

తన మన బేధం లేకుండా చర్యలు వుంటాయి.. పారదర్శకంగా అభివృద్ధి విషయంలో టెండర్ల ప్రకారం కేటాయింపులు ఉంటాయి.. మోడీ సర్కార్ అదాని, అoభానిలకు వెసలుబాటు కల్పించారు.. రతన్ టాటా నిస్వార్థ సేవ చేశాడు.. ఫోన్ ట్యాపింగ్ తీవ్రమయిన కేసు.. డ్రగ్స్ విషయంలో కూడా ఎవ్వరినీ వదలం.. గత ప్రభుత్వం లెక్కలు చూస్తే.. చూసి చూసి ఆర్ధిక మంత్రి భట్టికి బీసీ వచ్చింది.. రియల్ ఎస్టేట్ కూడా త్వరలో పుంజుకుంటది.. దేశంలో నంబర్ వన్ గా ఉంటుంది.. జనాభా ప్రకారం డిలిమిటేషన్ వద్దని కాంగ్రెస్ చెప్తుంది.. జనాభా తక్కువ ఉన్న దేశాలు అభివృద్ధి చెందుతున్నయి.. మహారాష్ట్రలో పార్టీ పేరుతో కేసీఆర్ డబ్బులు వేస్ట్ చేశారు’ అని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Rammohan Naidu: శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bc census
  • mahesh kumar goud
  • party expansion
  • political leadership
  • telangana Congress

తాజావార్తలు

  • PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్‌ ఇన్నింగ్స్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం.!

  • Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్

  • The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?

  • S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది

  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions