ఓటు అనే అస్త్రంతో చంద్రబాబుకు సమాధానం చెప్పాలి..
కృష్ణా జిల్లా మచిలీపట్నం మేమంతా సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతోంది.. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీల ఎన్నిక కోసం జరిగే ఎన్నికలు కాదన్నారు. ఇంటింటికి భవిష్యత్లో పథకాల కొనసాగింపు కోసం జరిగే ఎన్నికలని సీఎం జగన్ తెలిపారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో అమలు కాని హామీలు అని విమర్శించారు. చంద్రబాబును నమ్మటం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టడమేనని ఆరోపించారు. చంద్రబాబును నమ్మటం అంటేనే చంద్రముఖిని నిద్రలేపటమేనని ముఖ్యమంత్రి తీవ్ర విమర్శలు చేశారు.
నీ మాదిరిగా పూటకో పెళ్లి చేసుకునే చరిత్ర కాదు
అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై హిందూ సమాజం అంతా ఆలోచన చేయాలన్నారు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ఎస్సీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం అద్దంకి దయాకర్ దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని, అద్దంకి దయాకర్ మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుని మాట్లాడినట్లు ఉందన్నారు కొప్పు భాష. సీతా, రాముల చరిత్ర, దేశ చరిత్ర అద్దంకి దయాకర్ కు లేదని, అద్దంకి దయాకర్ హిందువా.. క్రిస్టియన్ హా స్పష్టం చేయాలన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హిందువులను తిట్టమని చెప్పారా?. మతపరమైన రిజర్వేషన్లు వద్దని అంబేద్కర్ చెప్పారు అని ఆయన అన్నారు. అంబేద్కర్ ఆశయానికీ తూట్లు పొడిచి మతపరమైన రిజర్వేషన్లు తెచ్చారని, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని అద్దంకి దయాకర్ తో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాట్లాడించారని కొప్పు బాష అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుంది..
అనకాపల్లి జిల్లా తాళ్ళపాలెంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆధ్వర్యంలో ప్రజా గళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం జెండా రెపరెపలాడుతుందని ప్రధాని మోడీ తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం అన్నారు. అభివృద్ది చెందుతున్న భారత్ నినాదంతో జరుగుతున్న ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
25 ఏళ్లుగా ఎస్సిసిఎల్లో బొగ్గు గని కార్మికుడిగా పనిచేశా
పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తనకు మద్దతు ఇవ్వాలని బొగ్గుగని కార్మికులు కోరారు. సోమవారం బెల్లంపల్లిలోని భూగర్భగని శాంతిఖనిలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఎన్నికల ప్రచారంలో ఈశ్వర్ మాట్లాడుతూ తాను 25 ఏళ్లుగా ఎస్సిసిఎల్లో బొగ్గు గని కార్మికుడిగా పనిచేశానని, వారి సవాళ్లను తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. మైనర్ల హక్కుల కోసం తాను పోరాటం చేశానని, గని కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించానని పేర్కొన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తు చేశారు. రివైవ్డ్ డిపెండెంట్ జాబ్ స్కీమ్ కింద మైనర్ల కుటుంబ సభ్యులకు 25 వేల ఉద్యోగాలు కల్పించడంతోపాటు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో కీలకపాత్ర పోషించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు నాయకత్వానికి గని కార్మికులు అండగా నిలవాలన్నారు.
తెలంగాణలో రైతులకు గుడ్న్యూస్.. రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణ ప్రభుత్వం రైతులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా (రైతు బంధు) నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు వారికి నిధులు విడుదల చేసిన సర్కార్.. సోమవారం ఐదు ఎకరాలు పై బడిన రైతులకు ఫండ్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ జమ చేసింది. రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 5 ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. తాజాగా ఐదు ఎకరాలు పైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించారు.
హైదరాబాద్లో పోలింగ్ భద్రత కోసం 14వేల సిబ్బంది
వచ్చే నెల 13న జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం హైదరాబాద్ పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పోలింగ్ సందర్భంగా నగరంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్)తో సహా మొత్తం 14 వేల మంది సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. భారత ఎన్నికల సంఘం (EC) మార్గదర్శకాల ప్రకారం, CAPF సిబ్బందిని నగరంలోని పోలింగ్ కేంద్రాల వద్ద మోహరిస్తారు. ” EC హైదరాబాద్కు 22 CAPF కంపెనీలను అందించింది. అవసరమైన చోట, తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ మరియు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ను పోలింగ్ స్టేషన్ల వద్ద మోహరిస్తారు, ”అని కమిషనర్ తెలిపారు.
బెంగళూరులో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు
భారీ వర్షంతో టెక్ సిటీ బెంగళూరు తడిసిముద్దైంది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వర్షం కురిసింది. దీంతో బెంగళూరు వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు నీటి కొరత.. ఇంకోవైపు తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో బెంగళూరు వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తుది దశకు కేసీఆర్ బస్సు యాత్ర
భారత ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం తర్వాత వరుసగా నాలుగో రోజుకి అడుగుపెట్టిన బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు బస్సుయాత్ర చివరి దశకు చేరుకోనుంది. ప్రచారానికి చివరి వారంలో మరిన్ని నియోజకవర్గాలను కవర్ చేయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. సోమవారం వందలాది మంది నాయకులు, కార్యకర్తలతో వాహనాల కాన్వాయ్తో చంద్రశేఖర్రావు ప్రజలతో మమేకమై వారి సమస్యలు, బాధలను వింటూ వారి సమస్యలను విన్నవించారు. కొప్పుల ఈశ్వర్ తన అభ్యర్థిత్వానికి ఎన్నికల మద్దతును అందించాలని బొగ్గు గని కార్మికులను కోరారు. జగిత్యాలలోని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసంలో ఆదివారం రాత్రి బస చేసిన ఆయన సోమవారం ఉదయం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
ఏపీలో పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో ప్రధాన పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఓ వైపు కూటమి, మరో వైపు వైసీపీ అగ్రనేతలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. మే 7వ తేదీన(రేపు) మూడు నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం చేయనున్నారు.