Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 21 11 2024

Top Headlines @5PM : టాప్ న్యూస్‌

Published Date :November 21, 2024 , 5:19 pm
By Gogikar Sai Krishna
  • అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు
  • కరీంనగర్‌లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్‌
  • రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది
  • దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?
Top Headlines @5PM : టాప్ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ జ‌డ్జి త‌న ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేయడంతో.. భారత్ లో రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతమ్ అదానీ.. భార‌తీయ‌, అమెరికా చ‌ట్టాల‌ను ఉల్లంఘించిన‌ట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ క‌లిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటార‌ని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మ‌ద‌హ‌బి పురి బుచ్‌ను సైతం ఈ కేసులో ఎంక్వైరీ చేయాలన్నారు.

చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?

తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఆమె మృతదేహాన్ని చితిపై వేశాక ఆమె శరీరంలో కదలికలు వచ్చాయి. ఇది చూసి అందరూ భయపడ్డారు. అందరూ కొంత దూరం పరిగెత్తారు. అప్పుడు ఆ స్త్రీ లేచి నిలబడింది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. మహిళ సజీవంగా ఉండటంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..

తెలంగాణలో లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు అయ్యింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని సతీమణి పట్నం శృతి పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పట్నం శృతి పిటిషన్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్టుచేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాట్టించలేదని పేర్కొన్నారు. డి.కె. బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శృతి పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి. సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ చేర్చారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?

జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్రాటు గ్రామానికి చెందిన ఫులేశ్వర్ పహాన్, అతని మూడో భార్య సునీతాదేవి మద్యం తాగి తమ కుమారుడిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అతను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిద్దరూ తమ 25 ఏళ్ల కుమారుడు మదన్ పహాన్ తలపై గుడ్డ కప్పి పిస్టల్‌లో కాల్చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన తర్వాత నిందితులిద్దరూ పరారయ్యారు.

ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్

ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అసెంబ్లీలో మూడు కమిటీలకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంచనాల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. అంతకు ముందు నామినేషన్‌ వేయడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ అధికారులు రెండు గంటల పాటు ఎదురుచూసేలా చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి విద్య, వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు

మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్‌ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కావస్తుందని, 300కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం మహారాష్ట్రతో పాటు జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారని, నిర్మాణం తో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్య కు కేటాయించామని ఆయన వెల్లడించారు. నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు అని, మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చి న ఘనత మీ ఎమ్మెల్యేది అని, బీఆర్‌శ్రీస్‌, బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..

రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఎకరాల భూమి అమరావతిలో పోలీసు మార్టియర్స్ డే కోసం ఇస్తామన్నారు. సైబర్ పోలీసు స్టేషనులు పెడుతున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు..ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తుళ్ళూరులో పెడతామని చెప్పారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇక్కడకి తీసుకొస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది

రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలన్నారు మహేష్ గౌడ్‌. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు.

కరీంనగర్‌లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్‌

ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందన్నారు కేటీఆర్‌. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టిఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని, దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు కేటీఆర్‌. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • peddireddy Ramachandra Reddy
  • telugu news
  • Top Headlines 5PM

తాజావార్తలు

  • Telangana Cabinet: ఇద్దరు మంత్రులకు ఉద్వాసన, ముగ్గురికి కొత్తగా అవకాశం..!

  • Iftar Dinner: నేడు ముస్లిం సోదరులకు వైసీపీ ఇఫ్తార్ విందు.. పాల్గొననున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

  • Telangana Rain Alert: రాష్ట్రంలో ఈ నాలుగు రోజులు భారీ వర్షాలు.. ప్రజలకు కీలక హెచ్చరికలు!

  • 8.12 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 200MP కెమెరాతో OPPO Find N6 లాంచ్.. ధర ఎంతంటే?

  • Parents Smoking: తల్లితండ్రుల అలవాట్లు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం.. కొత్త అధ్యనంలో షాకింగ్ విషయాలు..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions