Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 5 Pm On December 7th 2023

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

NTV Telugu Twitter
Published Date :December 7, 2023 , 5:14 pm
By Sudhakar Ravula
Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం..
ఎల్బీ స్టేడియంలో తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఢిల్లీ నుంచి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఇక, రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కేరింతలతో దద్దరిల్లింది. ఇక, తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్న వేళ ఎల్‌.బి.స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌ అగ్రనేతలు అందరూ తరలి రావడంతో స్టేడియం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉదయం నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు స్టేడియానికి వచ్చారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి విచ్చేసే అతిధులను అలరించేందుకు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు. అలాగే, భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మరో వైపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై ఆయన చేత ప్రమాణం చేయించారు.

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. పలువురు అభినందనలు
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఇంగ్లిష్, తెలుగు భాషలలో ప్రధాని ట్వీట్ చేశారు. అంతేకాకుండా.. అందులో రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. తెలంగాణకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘తెలంగాణ ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాడు అందిస్తానని నేను హామీ ఇస్తున్నానని’ ట్వీట్ లో పేర్కొన్నారు. మరోవైపు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. అటు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన భట్టి విక్రమార్క, మంత్రులుగా ప్రమాణం చేసిన వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అని పేర్కొన్నారు.

సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలి-గవర్నర్‌
సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలని ఆకాక్షించారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలని ప్రజలందరికీ తెలియజెప్పడానికే ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లక్ష్యం అన్నారు. అర్హులైన లబ్దిదారులందరికీ ఈ పథకాలు అందించడమే ఈ యాత్ర లక్ష్యం.. సంక్షేమ‌ పథకాలు అర్హులందరికీ అందాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ‌పథకాలపై అందరికీ అవగాహన కల్పించడం‌కోసం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన, పీఎం ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, పీఎం కిసాన్ క్రెడిట్, పీఎం పోషణ్, దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, పీఎం ఉజ్వల్ యోజ్ రోజ్ గార్ మేళా.. ఇలా కీలక సంక్షేమ‌ పథకాలని కేంద్రం అందిస్తోందన్నారు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌.. ప్రజల అవసరాలని గుర్తించి వాటిని నెరవేర్చడమే ప్రభుత్వాల‌ లక్ష్యం అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అవసరమైన సంక్షేమ కార్యక్రమాలని అందించడంలో ముందుంది.. మహిళాభివృద్దికి ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్ర కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకి 15 వేల డ్రోన్ లు అందించడం జరుగుతుందన్నారు.

ఏపీలో కుల గణన మరోసారి వాయిదా.. కారణం ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో కుల గణన మరోసారి వాయిదా పడింది.. నిజానికి ఏపీ ప్రభుత్వం నవంబర్‌ 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. కానీ, ఆ తేదీని మార్చుతూ.. డిసెంబర్ 9వ తేదీగా గతంలో ప్రకటించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌.. డిసెంబర్‌ 9వ తేదీ నుంచి కుల గణన ప్రక్రియ షురూ కాబోతుంది అంటూ నవంబర్‌ 24న ప్రకటించారు.. కానీ, ఇప్పుడు మరోసారి కుల గణన వాయిదా పడింది.. ఈ నెల 9న జరగాల్సిన సమగ్ర కుల గణన మిచౌంగ్ తుఫాన్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని వెల్లడించారు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. రాష్ట్రంలో కుల గణన వాయిదా పడింది .. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టంపై అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.. ఈ సమయంలో తుఫాన్ నష్టం, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది.. అందుకే 9వ తేదీ నుంచి చేపట్టాల్సిన కుల గణన వాయిదా వేసినట్టు వెల్లడించారు వేణుగోపాలకృష్ణ.. తుఫాన్‌ పరిస్థితులు చక్కబడిన వెంటనే త్వరలో కులగణన తేదీని ప్రకటిస్తాం.. అబద్దానికి చంద్రబాబు ఒక రూపం.. తుఫాన్ పై కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని వాలీంటీర్, సచివాలయ వ్యవస్థ ఏపీలో ఉంది.. తుఫాన్ పై ప్రభుత్వం వేగంగా స్పందించిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.

తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్‌.. ఏపీ సీఎం ఆసక్తికర ట్వీట్
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్‌ చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం జగన్‌.. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. జల వివాదాలతో పాటు.. మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.

తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..
తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..తన పక్కింట్లోనే ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హత్య చేశాడు. పదేపదే తనను ఆటపట్టిస్తుందని, ఏడిపిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెల్హార్ గ్రామంలో డిసెంబర్ 1న ఈ హత్య చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన 3 రోజుల తర్వాత బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలిక మృతదేహాన్ని తరలించేందుకు సహకరించినట్లు బాలుడి తండ్రి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వయసు 16 ఏళ్లు అని వసాయ్ తాలూకాలోని పెల్హార్ పోలీస్ అధికారులు తెలిపారు.

ఒడిశా వ్యాప్తంగా ఐటీ దాడులు.. రూ.200 కోట్లు స్వాధీనం..
ఒడిశాలోని మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒడిశా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడ్డాయి. బుధవారం మద్యం పరిశ్రమలో పన్నుల ఎగవేతపై ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేయడం ప్రారంభించారు. గురువారం కూడా ఈ కేసులో అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ ఒడిశాలోని ప్రముఖ మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన బల్డియో సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రైడ్స్ నిర్వహించారు. దీంతో పాటు గురువారం మరో మద్యం తయారీదారు బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన సంబల్ పూర్ కార్యాలయంలో రూ.150 కోట్లకు పూగా నిధులను జప్తు చేశారు. రెండు రోజుల్లో ఈ మద్యం కంపెనీల నుంచి ఏకంగా రూ. 200 కోట్ల నగదును పట్టుకున్నారు. మొత్తం 30 మంది సభ్యుల ఐటీ బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, ఎండీలను లక్ష్యంగా చేసుకుని కోల్‌కతా, రాంచీలో సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు బయలుదేరారు. 2019-2021 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు నికర లాభాలను తగ్గించి చూపించాయని అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్‌లో అనుమానాస్పద ఇతర చెల్లింపులు ఉన్నాయి. ఒడిశాతో పాటు జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరో అర డజన్ కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.

పాకిస్తాన్ “ముజాహిదీన్” భూమి.. మీరే ఇజ్రాయిల్‌ని అడ్డుకోగలరు.. హమాస్ నేత కీలక వ్యాఖ్యలు..
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం మళ్లీ మొదలైంది. ఇన్నాళ్లు ఉత్తరప్రాంతానికే పరిమితమైన యుద్ధం, ఇప్పుడు దక్షిణ గాజాపై కూడా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ యుద్ధంలో, హమాస్ కీలక నేత ఇస్మాయిల్ హనియే పాకిస్తాన్ మద్దతు కోరారు. పాకిస్తాన్ దేశాన్ని ధైర్యవంతుడిగా కొనియాడుతూ.. ఇజ్రాయిల్ పాకిస్తాన్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటే, ఆ దేశ క్రూరత్వం ఆడిపోతుందని చెప్పినట్లు ఆ దేశ జియో న్యూ్స్ బుధవారం నివేదించింది. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌‌లో ‘అల్-అక్సా మసీదు పవిత్రత, ముస్లి ఉమ్మా యొక్క బాధ్యత’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో హనీయే ఈ వ్యాఖ్యలు చేశారు. హమాస్‌కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుందనే ఆశను వ్యక్తం చేస్తూ.. పాకిస్తాన్‌ని ‘‘ముజాహిదీన్(ఇస్లాం కోసం పోరాడే వ్యక్తుల)భూమి’’ అని కొనియాడారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల త్యాగాలను చెబుతూ.. పాకిస్తాన్ ఈ వివాదాన్ని సమర్థవంతంగా ఆపగలదని చెప్పారు. పవిత్ర ఖురాన్‌ని అనుసరించే దేశాలు గాజాస్ట్రిప్ లో ఇజ్రాయిల్ దాడిని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో 16 వేల మందిని చంపేశారని, పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడంతో సహా ఇజ్రాయిల్ చర్యలు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు.

తిరుపతిలో అల్లు కోడలు.. కెమెరా కంటికి కనిపించకుండా అల్లరి చేసిన అర్హ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం వేద పండితులు.. స్నేహా రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తిరుమలలో అల్లు అర్హ అల్లరి అంతా ఇంతా కాదు. పుట్టిన దగ్గరనుంచి అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీ గా మారిపోయింది. పెరిగేకొద్దీ.. అర్హ ఫోటోలను, వీడియోలను స్నేహ, బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ కంటే అర్హ గురించే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు అభిమానులు. ఇక తండ్రితో కలిసి అర్హ చేసే అల్లరి అంతాఇంత కాదు. తాజాగా తిరుమలలో కూడా అర్హ అల్లరి చేస్తూ కనిపించింది. తల్లి వెనుక దాక్కొని కెమెరాల కంటికి కనిపించను అని మారాం చేసింది. ఫొటోగ్రాఫర్లు అర్హ.. అర్హ అని పిలుస్తున్నా నేను రాను అంటూ స్నేహ వెనక్కి వెళ్లి దాక్కొంది. అంతేకాకుండా తల్లి చున్నీని ముఖానికి అడ్డుపెట్టుకొని కనిపించింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వావ్ .. అర్హ.. భలే క్యూట్ గా ఉన్నావే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు.

ఘనంగా రానా తమ్ముడి పెళ్లి.. ఫోటోలు వైరల్
ఎట్టకేలకు దగ్గుబాటి చిన్న వారసుడు దగ్గుబాటి అభిరామ్ ఒక ఇంటివాడు అయ్యాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్ .. ఈ ఏడాది అహింస చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక కొద్దిరోజుల క్రితం నుంచే అభిరామ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వరుసకు మరదలు అయ్యే ప్రత్యూష అనే అమ్మాయితో అభిరామ్ వివాహం నేడు ఘనంగా జరిగింది. వీరి పెళ్ళికి శ్రీలంక వేదిక అయ్యింది. దాదాపు 200 మంది బంధుమిత్రుల మధ్య వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ పెళ్ళిలో రానా భార్య మిహిక సందడి చేసింది. మరో రెండు రోజులు వీరు శ్రీలంకలోనే ఉండి.. ఆ తరువాత హైదరాబాద్ కు రానున్నట్లు సమాచారం. ఇక ఇక్కడకు వచ్చాక ఘనంగా రిసెప్షన్ ఉండనుందని తెలుస్తోంది. టాలీవుడ్ మొత్తం ఈ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక నూతన వధూవరులకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇకపోతే అహింస తరువాత అభిరామ్ సినిమాలకుకొద్దిగా గ్యాప్ ఇచ్చి.. హోటల్ బిజినెస్ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత అభిరామ్ హీరోగా కంటిన్యూ అవుతాడా.. ? లేక బిజినెస్ లోనే రాణిస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.

యానిమల్ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే..?
యానిమల్ మూవీ ఓటీటీ హక్కులను రికార్డ్ ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ మూవీ జనవరి 26న ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్లు సమాచారం. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో కూడా అదే రోజు నుంచి యానిమల్‌ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. యానిమల్ మూవీ థియేటర్ రన్ టైం 3 గంటల 21 నిముషాలు..థియేటర్‌తో పోలిస్తే యానిమల్ మూవీ ఓటీటీ వెర్షన్ లెంగ్త్ ఇంకో ఇరవై నిమిషాల ఎక్కువగానే ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.తండ్రికొడుకుల డ్రామాకు యాక్షన్ రివేంజ్ అంశాలను జోడించి సందీప్ వంగా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో తండ్రి పట్ల అపారమైన ప్రేమ కలిగిన యువకుడిగా రణ్‌బీర్ తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. తన తండ్రిని హత్య చేయాలని ప్రయత్నించిన శత్రువుల్ని రణ్ బీర్ ఎలా ఎదుర్కొన్నాడన్నది విపరీతమైన వయోలెన్స్‌తో సందీప్ వంగా ఈ సినిమాలో చూపించారు.అతడి టేకింగ్‌, మేకింగ్‌పై బాలీవుడ్‌ మరియు టాలీవుడ్ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వినిపిస్తోన్నాయి. అయితే కొంత మంది మాత్రం సినిమాలో మితిమీరిన వయోలెన్స్ ఉందంటూ కామెంట్ లు చేస్తున్నారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Tollywood
  • Top Headlines @ 5 PM

తాజావార్తలు

  • Miss World 2025: మిస్ వరల్డ్ నుంచి నందిని గుప్తా నిష్క్రమణ..

  • Kannappa : శివరాజ్ కుమార్‌ మూవీ‌లో.. విలన్ రోల్ అడిగిన మోహన్ బాబు

  • Raghunandan Rao: కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు

  • Acharya pramod krishnam: రాహుల్ గాంధీకి పాకిస్తాన్‌లో ఫుల్ క్రేజ్, అక్కడ పోటీ చేస్తే గెలుస్తాడు..

  • Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions