Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Top Headlines 1pm On March 4th

Top Headlines @1PM: టాప్ న్యూస్

NTV Telugu Twitter
Published Date :March 4, 2023 , 1:00 pm
By Mahesh Jakki
Top Headlines @1PM: టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

నవీన్‌ హత్య కేసు.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణ కస్టడీ కొనసాగుతోంది. కస్టడీలో భాగంగా హరిహరకృష్ణను రెండో రోజు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో నిన్న సరూర్‌నగర్‌లోని ఎస్ఓటీ కార్యాలయంలో విచారించిన పోలీసులు ఇవాళ కూడా విచారిస్తున్నారు. ఈనెల 9 వరకు నిందితుడిని కస్టడీకి కోర్టు అనుమతించగా.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం హరిహరకృష్ణను ఈరోజు తెల్లవారుజామున ఘటనాస్థలికి పోలీసులు తీసుకెళ్లారు. హత్య చేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. నవీన్‌ని హత్య చేయడానికి కేవలం ప్రేమ వ్యవహారమే కారణమా లేకపోతే ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన అనంతరం హరిహరకృష్ణ లొంగిపోయినా.. శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా నిందితుడు జాగ్రత్తలు తీసుకోవడం వెనక.. ఎవరైనా సహాయం చేశారా.. సలహాలిచ్చారా.. అనే వివరాలు రాబట్టాల్సి ఉంది. ఈ కేసులో నిందితుడి స్నేహితురాలుపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు మూడుసార్లు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విచారించగా.. స్పష్టమైన సమాధానాలు రాబట్టలేకపోయారని తెలుస్తోంది.

 

రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌కు భారీ యాక్సిడెంట్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. రేవంత్‌ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వెళుతున్న కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 6 కార్లు ధ్వంసమవ్వగా.. పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే గట్టిగా ఢీకొనడంతో కారులోని బెలూన్లు ఓపెన్ కావడంతో రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లైంది. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే, రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లో 6 కార్లకు యాక్సిడెంట్ అయింది. 6 కార్లలో 4 కార్లు రేవంత్ కాన్వాయ్‌కు సంబంధించినవి కాగా.. మరో రెండు కార్లు రిపోర్టర్లకు చెందినవని తెలిసింది. కార్లలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

 

స్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి మృతి.. టీచర్‌ కొట్టడం వల్లే!

వికారాబాద్ జిల్లా పుదూరు మండలం చిలాపూర్‌లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల పిల్లాడు కార్తీక్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లవాడిని ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే కింద పడిపోయాడని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని తెలిసింది. పాఠశాలలో ఉపాధ్యాయుడు చితక బాధడంతో అస్వస్థతకు గురవడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీనిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. తన కొడుకుని ఉపాధ్యాయుడు కొట్టడంతో మృతి చెందాడు అంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్‌లో చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేశవరెడ్డి పాఠశాల యజమాన్యం మాత్రం ఇంటికి వెళ్లిన అనంతరం అక్కడే బాలుడు బెడ్‌పై నుంచి పడడం వల్ల చనిపోయాడని అనుమానించింది. స్కూల్ యాజమాన్యం దౌర్జన్యంగా కొట్టడం వల్లే కార్తీక్ చనిపోయాడనీ.. చదువు చెబుతారని స్కూల్‌కి పంపితే.. ఏకంగా ప్రాణాలే తీసేశారని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చెయ్యాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన బాలుడి స్వస్థలం మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినవాడు.

 

రెండో రోజు ఏపీ ప్రభుత్వం కీలక ఎంవోయూలు

విశాఖపట్టణం వేదికగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ 2023లో భాగంగా రెండో రోజు కొన్ని కంపెనీలు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MOU) కుదుర్చుకున్నాయి. దాదాపు 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు జరగ్గా.. వీటిలో రిలయన్స్‌ కంపెనీ రూ.50వేల కోట్లలో అగ్రగామిగా నిలిచింది. ఒకసారి పూర్తి ఎంఓయూల జాబితాని పరిశీలిస్తే.. రిలయన్స్‌ రూ. 50,000 కోట్లు.. హెచ్‌పీసీఎల్‌ ఎనర్జీ రూ. 14,320 కోట్లు.. టీవీఎస్‌ ఐఎల్‌పీ రూ. 1,500 కోట్లు.. ఎకో స్టీల్‌ రూ. 894 కోట్లు.. బ్లూస్టార్‌ రూ. 890 కోట్లు.. ఎస్‌2పీ సోలార్‌ సిస్టమ్స్‌ రూ. 850 కోట్లు.. గ్రీన్‌లామ్‌ సౌత్‌ లిమిటెడ్‌, ఎక్స్‌ప్రెస్‌ వెల్‌ రీసోర్సెస్‌ చెరో రూ. 800 కోట్లు.. రామ్‌కో రూ. 750 కోట్లు.. క్రిబ్కో గ్రీన్‌ రూ. 725 కోట్లు.. ప్రకాశ్‌ ఫెరోస్‌ రూ. 723 కోట్లు.. ప్రతిష్ట బిజినెస్‌, తాజ్‌ గ్రూప్‌, కింబర్లీ క్లార్క్‌ రూ. 700 కోట్లు చొప్పున ఎంఓయూలు.. అలియన్న్‌ టైర్‌ గ్రూప్‌ రూ. 679 ‍కోట్లు.. దాల్మియా, అనా వొలియో వరుసగా రూ. 650 కోట్లు.. డీఎక్స్‌ఎన్‌ రూ. 600 కోట్లు.. ఈ-ప్యాక్‌ డ్యూరబుల్‌ రూ. 550 కోట్లు.. నాట్‌ సొల్యూషన్న్‌ రూ. 500 కోట్లు.. అకౌంటిఫై ఇంక్‌ రూ. 488 కోట్లు.. కాంటినెంటల్‌ ఫుడ్‌ అండ్‌ బెవరేజీస్‌, నార్త్‌ ఈస్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ చెరో రూ. 400 కోట్లు.. ఆటమ్‌స్టేట్‌ టెక్నాలజీస్‌, క్లేరియన్‌ సర్వీసెస్‌, చాంపియన్‌ లగ్జరీ రిసార్ట్స్‌ చెరో రూ. 350 కోట్ల ఎంఓయూలు జరిగాయి. అంతేకాదు.. వీఆర్‌ఎమ్‌ గ్రూప్‌ రూ. 342 కోట్లు.. రివర్‌ బే గ్రూప్‌, హావెల్స్‌ ఇండియా, సూట్స్‌ కేర్‌ ఇండియా, పోలో టవర్స్‌, ఇండియా అసిస్ట్‌ ఇన్‌సైట్స్‌, స్పార్క్‌, టెక్‌ విషెన్‌ సాఫ్ట్‌వేర్‌, మిస్టిక్‌ పామ్స్‌, నియోలింక్‌ గ్రూప్‌ వరుసగా రూ. 300 కోట్లు చొప్పున ఎంఓయూలు.. ఎండానా ఎనర్జీస్‌ రూ. 285 కోట్లు.. అబ్సింకా హోటల్స్‌ రూ. 260 కోట్లు.. సర్‌ రే విలేజ్‌ రిసార్ట్స్‌, హ్యాపీ వండర్‌లాండ్‌ రిసార్ట్స్‌, చాంపియన్స్‌ యాచ్‌ క్లబ్‌, టెక్నోజెన్‌, పార్లె ఆగ్రో చెరో రూ. 250 కోట్లు.. ఎకో అజైల్‌ రిసార్ట్‌ రూ. 243 కోట్లు.. ఎల్జీ పాలిమర్స్‌ రూ. 240 కోట్లు.. హైథియన్‌ హ్యూయన్‌ మిషనరీ, గోకుల్‌ ఆగ్రో చెరో రూ. 230 కోట్లు.. ఎస్‌పీఎస్‌ ఇన్‌ఫ్రా రూ. 225 కోట్లు.. డీవీవీ బయో ఫ్యూయల్స్‌ రూ. 223 కోట్లు.. దాల్వకోట్‌ బయో ఫ్యూయల్ప్‌, ఆమ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ చెరో రూ. 200 కోట్లు.. కేపిటల్‌ బిజినెస్‌ పార్క్‌ రూ. 184 కోట్లు.. చాంయిన్‌ యాచ్‌ రూ. 190 కోట్లు.. ఎన్‌జీసీ ట్రాన్స్‌మిషన్‌ రూ. 185 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి.

 

వధువు చేసిన చిన్న తప్పు.. పెళ్లి రద్దు చేసిన వరుడు

సాధారణంగా పెళ్లి వేడుకలకు వచ్చే అతిథులే ఎంతో అందంగా ముస్తాబైవస్తారు. అలాంటప్పుడు.. పెళ్లికూతురు అందరిలోనూ ప్రత్యేకంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు. ఆ కోరికతోనే ఓ వధువు బ్యూటీపార్లర్‌కి వెళ్లింది. తనని అందమే అసూయపడేంత అందంగా, తనకు కాబోయే భర్త చూడగానే ఫిదా అయ్యేలా తయారు చేయాలని కోరింది. పాపం ఆ నవ వధువు, అలా కోరిందో లేదో, క్షణాల్లోనే ఆమె ఆశలు ఆవిరైపోయాయి. మేకప్ తేడా కొట్టడంతో.. ఆమె ముఖం చెడిపోయింది. దీంతో.. ఆమె పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని హసన్‌ జిల్లా అరసికెరె గ్రామానికి చెందిన ఓ యువతికి కొన్ని రోజుల క్రితం పెళ్లి నిశ్చయమైంది. వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించారు. త్వరలోనే పెళ్లి కావడంతో.. నవ వధువు అందంగా ముస్తాబవ్వడం కోసం స్థానికంగా ఉన్న బ్యూటీపార్లర్‌కు వెళ్లింది. తొలుత ఫేషియల్ చేసుకుంది. అనంతరం ఆవిరి పడుతున్న సమయంలో.. పొరపాటు జరిగిపోయింది. వేడి కారణంగా ఆమె ముఖం వాడిపోయింది. దీంతో అందంగా ఉన్న ఆమె.. అందవిహీనంగా తయారైంది. ముఖం నల్లగా మారిపోయి, వాచింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న వరుడు.. ఆమెను చూసేందుకు ఆసుపత్రి వెళ్లాడు. అక్కడ ఆమె ముఖం చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ముఖం మాత్రం వాచిపోవడంతో, తనకు ఆ అమ్మాయి వద్దని నిరాకరించాడు. పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో.. వధువు కుటుంబ సభ్యులు ఆందోళనలో పడ్డారు. ఈ క్రమంలోనే వారు ఈ ఘటనకు కారణమైన బ్యూటీ పార్లర్ యజమాని గంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు.. పెళ్లి ఆగిపోవడంతో వధువు కుటుంబం నిరాశలో మునిగింది.

 

మైనారిటీలు పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా జీవించలేరు.. యూఎన్‌లో భారత్

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ)లో మైనారిటీల మత స్వేచ్ఛ అంశంపై భారత్ శుక్రవారం పాకిస్థాన్‌ను తీవ్రంగా తప్పుబట్టింది.ప్రత్యుత్తరమిచ్చే హక్కును ఉపయోగించి, భారతదేశ ప్రతినిధి సీమా పూజనీ తన పాకిస్తానీ కౌంటర్ హీనా రబ్బానీ ఖార్‌ను నిందించారు, “ఈ రోజు పాకిస్తాన్‌లో ఏ మతపరమైన మైనారిటీ స్వేచ్ఛగా జీవించలేరు లేదా వారి మతాన్ని ఆచరించలేరు. అహ్మదీయ సమాజం వారి విశ్వాసాన్ని ఆచరించినందుకు హింసిస్తోంది.” అని సీమా పూజానీ పేర్కొన్నారు. పాక్ కౌంటర్ హీనా రబ్బానీ ఖార్ చేసిన ప్రకటనపై పూజానీ స్పందిస్తూ.. పాకిస్థాన్ ప్రతినిధి మరోసారి భారతదేశానికి వ్యతిరేకంగా ఈ ఆగస్టు ఫోరమ్‌ను దుర్వినియోగం చేయడానికి ఎంచుకున్నారని అన్నారు. దేశంలోని క్రైస్తవుల దుస్థితిని, దేశంలో వారు ఎలా అన్యాయానికి గురవుతున్నారో కూడా ఆమె ఎత్తిచూపారు. క్రిస్టియన్ కమ్యూనిటీ పట్ల అదే విధంగా అధ్వాన్నంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వ సంస్థలు అధికారికంగా క్రైస్తవుల కోసం పారిశుధ్య ఉద్యోగాలను రిజర్వ్ చేస్తాయని పూజానీ పేర్కొన్నారు. తక్కువ వయస్సు గల మైనారిటీ బాలికల మత మార్పిడికి సంబంధించి దోపిడీ చేసే రాజ్యం, ఉదాసీన న్యాయవ్యవస్థపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

 

చమ్కీల అంగేసి… నాని ఎవరి పెళ్లికి సిద్ధమవుతున్నాడు?

పక్కింటి కుర్రాడి ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదగబోతున్నాడు నాని. అష్టా చెమ్మా నుంచి నాని ఎన్నో శుక్రవారాలు చూసి ఉంటాడు కానీ ఈ మార్చ్ 30 నానికి చాలా ఇంపార్టెంట్. తన మార్కెట్ ని పెంచుకోవడానికి, తను కొత్త రకం సినిమా చేశాను అని చూపించడానికి, తనపై ఫాన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చెయ్యడానికి మార్చ్ 30 నానికి ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు నాని నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’ ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఈ సినిమా హిట్ అయితే నాని రేంజ్ మారుతుంది, అతని కథల ఎంపిక మారుతుంది. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా సినిమాపై టీజర్ అంచనాలని పెంచింది. అప్పటివరకూ ఒక రేంజులో అంచనాలని టీజర్, ఆకాశాన్ని తాకేలా చేసింది. ఆ అంచనాలని మరింత పెంచుతూ నాని సాలిడ్ ప్రమోషన్స్ ని చేస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ నాని దసరా సినిమా ప్రమోషన్స్ ని చాలా అగ్రెసివ్ గా చేస్తున్నాడు. పోస్టర్స్, సాంగ్స్ తో హైప్ పెంచడంలో చిత్ర యూనిట్ కూడా సక్సస్ అయ్యాయి. ఇప్పటికే దసరా సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా దసరా సినిమా నుంచి మూడో పాట ‘చమ్కీల అంగేసి’ని మార్చ్ 8న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్మెంట్ పోస్టర్ లో నాని, కీర్తి సురేష్ లు స్కూటర్ పై కూర్చోని ఎక్కడికో వెళ్తున్నారు. ఈ వెడ్డింగ్ సీజన్ కి ఫోక్ మెలోడీ సాంగ్ అయిన ‘చమ్కీల అంగేసి’ పాటని గిఫ్ట్ ఇస్తున్నాం అని చిత్ర యూనిట్ చెప్తున్నారు కాబట్టి ఒక మంచి మాస్ పెళ్లి పాటని మార్చ్ 8న వినబోతున్నాం. పెళ్లి పాట అనేది బాగానే ఉంది కానీ ఇంతకీ నాని, కీర్తి సురేష్ లు కలిసి ఎవరి పెళ్లికి వెళ్తున్నారు అనేది చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • LATEST TELUGU NEWS
  • telugu news
  • Top Headlines
  • Top News

తాజావార్తలు

  • Nadendla Manohar: రేపటి నుంచి రేషన్ షాపుల రీ ఓపెన్.. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం..

  • Hyderabad: సూరారం మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులు ఎవరంటే..!

  • Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్నితప్పుదారి పట్టించింది.. సీడీఎస్ ప్రకటనపై ఖర్గే..

  • Opal Suchata: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న సుచతా బ్యాగ్రౌండ్ ఇదే!

  • Miss World 2025: మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్న థాయ్‌లాండ్ భామ సుచతా

ట్రెండింగ్‌

  • Moto g86 Series: మోటొరోలా నుంచి మోటో G86 పవర్ 5G, మోటో G86 5G, మోటో G56 5G మూడు కొత్త 5G ఫోన్లు లాంచ్…!

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions