Team India: ధోనీ, కోహ్లీ, గంగూలీ.. అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించింది ఎవరు?
- సునీల్ గవాస్కర్ మొదలు విరాట్ కోహ్లీ వరకు
- భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ విజయాలు
- అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లీ:
భారత టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ విషయానికి వస్తే కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పేరు ఎప్పుడూ ముందుంటుంది. 2014 నుంచి 2022 వరకు 68 టెస్ట్ మ్యాచ్లలో విరాట్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్ట్ మ్యాచ్లలో విజయాలు అందించాడు. కోహ్లీ టెస్ట్ విజయ శాతం 58.82 శాతంగా ఉంది. ఈ విజయ శాతం ఏ భారత కెప్టెన్కైనా అత్యుత్తమం. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఇంగ్లాండ్లో సిరీస్ ఆధిక్యం కూడా ఉంది. కోహ్లీ జట్టుకు దూకుడు, జట్టులో ఫిట్నెస్ సంస్కృతిని తెచ్చాడు.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఎంఎస్ ధోనీ:
మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. మహీ కెప్టెన్సీలో భారత్ 27 టెస్ట్ మ్యాచ్లలో గెలిచింది. ధోనీ విజయ శాతం 45. ధోని టెస్ట్ కెప్టెన్గా ఉన్న కాలంలో భారతదేశం టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. మహీ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. ధోనీ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో చాలా మ్యాచ్లను గెలవకపోవచ్చు కానీ.. స్వదేశంలో సత్తాచాటింది.
సౌరవ్ గంగూలీ:
సౌరవ్ గంగూలీ భారత జట్టుకు విదేశీ ఆటగాళ్లను ధీటుగా ఎదుర్కోవడం నేర్పించాడు. కోల్కతా యువరాజుగా పిలువబడే గంగూలీ 2000 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 49 టెస్టులు ఆడి 21 గెలిచింది. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశాలు ఇచ్చాడు. సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లలో గంగూలీ ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
Also Read: IND vs WI: కరేబియన్ క్రికెట్ క్యాన్సర్తో బాధపడుతోంది.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!
మహమ్మద్ అజారుద్దీన్:
1990-1999 మధ్య మహమ్మద్ అజారుద్దీన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం 47 టెస్టులు ఆడి 14 విజయాలు సాధించింది. అజరుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో కాకపోయినా.. స్వదేశంలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది.
సునీల్ గవాస్కర్:
సునీల్ గవాస్కర్ 47 టెస్ట్ మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1976 నుండి 1995లో లిటిల్ మాస్టర్ టెస్టులకు నాయకత్వం వహించాడు. భారత్ తొమ్మిది టెస్టుల్లో గెలిచి.. 30 డ్రా చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మార్కును చేరుకున్న తొలి ఆటగాడైన గవాస్కర్.. భారతదేశానికి అనేక ఉత్కంఠభరితమైన టెస్ట్ విజయాలను అందించాడు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!