Team India: ధోనీ, కోహ్లీ, గంగూలీ.. అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించింది ఎవరు?
- సునీల్ గవాస్కర్ మొదలు విరాట్ కోహ్లీ వరకు
- భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ విజయాలు
- అత్యధిక టెస్ట్ మ్యాచ్లకు నాయకత్వం వహించింది ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లీ:
భారత టెస్ట్ క్రికెట్లో కెప్టెన్సీ విషయానికి వస్తే కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పేరు ఎప్పుడూ ముందుంటుంది. 2014 నుంచి 2022 వరకు 68 టెస్ట్ మ్యాచ్లలో విరాట్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్ట్ మ్యాచ్లలో విజయాలు అందించాడు. కోహ్లీ టెస్ట్ విజయ శాతం 58.82 శాతంగా ఉంది. ఈ విజయ శాతం ఏ భారత కెప్టెన్కైనా అత్యుత్తమం. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ను గెలుచుకుంది. ఇంగ్లాండ్లో సిరీస్ ఆధిక్యం కూడా ఉంది. కోహ్లీ జట్టుకు దూకుడు, జట్టులో ఫిట్నెస్ సంస్కృతిని తెచ్చాడు.
Also Read
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ఎంఎస్ ధోనీ:
మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్ట్ మ్యాచ్ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. మహీ కెప్టెన్సీలో భారత్ 27 టెస్ట్ మ్యాచ్లలో గెలిచింది. ధోనీ విజయ శాతం 45. ధోని టెస్ట్ కెప్టెన్గా ఉన్న కాలంలో భారతదేశం టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. మహీ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. ధోనీ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో చాలా మ్యాచ్లను గెలవకపోవచ్చు కానీ.. స్వదేశంలో సత్తాచాటింది.
సౌరవ్ గంగూలీ:
సౌరవ్ గంగూలీ భారత జట్టుకు విదేశీ ఆటగాళ్లను ధీటుగా ఎదుర్కోవడం నేర్పించాడు. కోల్కతా యువరాజుగా పిలువబడే గంగూలీ 2000 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 49 టెస్టులు ఆడి 21 గెలిచింది. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశాలు ఇచ్చాడు. సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లలో గంగూలీ ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
Also Read: IND vs WI: కరేబియన్ క్రికెట్ క్యాన్సర్తో బాధపడుతోంది.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!
మహమ్మద్ అజారుద్దీన్:
1990-1999 మధ్య మహమ్మద్ అజారుద్దీన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం 47 టెస్టులు ఆడి 14 విజయాలు సాధించింది. అజరుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో కాకపోయినా.. స్వదేశంలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది.
సునీల్ గవాస్కర్:
సునీల్ గవాస్కర్ 47 టెస్ట్ మ్యాచ్లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1976 నుండి 1995లో లిటిల్ మాస్టర్ టెస్టులకు నాయకత్వం వహించాడు. భారత్ తొమ్మిది టెస్టుల్లో గెలిచి.. 30 డ్రా చేసుకుంది. టెస్ట్ క్రికెట్లో 10,000 పరుగుల మార్కును చేరుకున్న తొలి ఆటగాడైన గవాస్కర్.. భారతదేశానికి అనేక ఉత్కంఠభరితమైన టెస్ట్ విజయాలను అందించాడు.
తాజావార్తలు
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్కు రెడీ
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!