IND vs WI: కరేబియన్ క్రికెట్ క్యాన్సర్తో బాధపడుతోంది.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!
- అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో రెండో టెస్ట్
- వెస్టిండీస్ జట్టుపై డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు
- కరేబియన్ క్రికెట్ క్యాన్సర్తో బాధపడుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో వెస్టిండీస్ను భారత్ చిత్తుగా ఓడించింది. ఈ ఓటమి తర్వాత వెస్టిండీస్ హెడ్ కోచ్, విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ తాను విమర్శలకు సిద్ధంగా ఉన్నానని ఒప్పుకున్నాడు. ఒకప్పుడు ఆధిపత్యం చెలాయించిన కరేబియన్ టెస్ట్ జట్టు పతనానికి ఇటీవలి తన నిర్ణయాలు కాదని, దశాబ్దాల నాటి లోపాలే అని స్పష్టం చేశాడు. ఢిల్లీలో భారత్తో జరిగే రెండో టెస్టుకు ముందు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ మీడియాతో మాట్లాడాడు. గత నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలో వెస్టిండీస్ ఎందుకు సిరీస్ గెలవలేదో చర్చిస్తున్నామని చెప్పాడు.
‘భారతదేశంలో మేము చివరిసారిగా 1983లో టెస్ట్ సిరీస్ గెలిచాం. అప్పుడు నేను పుట్టాను. వెస్టిండీస్ 42 సంవత్సరాలుగా భారతదేశంలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. నాపై అందరి కళ్ళు ఉంటాయని తెలుసు. విమర్శలు వస్తాయని కూడా తెలుసు. వెస్టిండీస్ క్రికెట్ పతనం రెండేళ్ల క్రితం ప్రారంభం కాలేదు, ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. ఇది క్యాన్సర్ లాంటిది. క్యాన్సర్కు చికిత్స చేయకపోతే ఏమి జరుగుతుందో మనకు తెలుసు. ఇది రొమ్ము క్యాన్సర్ నెల కాబట్టి.. ఉదాహరించడానికి మంచి మార్గం అనుకుంటున్నా. మా సమస్యలు పైపైన లేవు, వ్యవస్థలో లోతుగా పాతుకుపోయాయి’ అని డారెన్ సామీ చెప్పాడు. సామీ విండీస్ సంక్షోభాన్ని మహమ్మారి క్యాన్సర్తో పోల్చాడు.
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
Also Read: Sanju Samson: 10 ఏళ్లలో 40 మ్యాచ్లు మాత్రమే ఆడా.. భావోద్వేగం చెందిన సంజు శాంసన్!
‘మేము ఐదు టెస్ట్ మ్యాచ్లను ఒకే చోట ఆడుతున్నాము. ఇక్కడ ఇతర బోర్డులు ప్రయోజనం పొందాయి. మన దగ్గర ఉన్న దానితో మాత్రమే మనం పని చేయగలం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఫ్రాంచైజీలతో సరిపోలలేకపోవడం ఒక సమస్య. మా జట్టు ఆటగాళ్లకు ఒకటే చెబుతా.. ఇతర జట్ల మాదిరిగా మనకు ఉత్తమ సౌకర్యాలు, సాంకేతికత లేదని. ఇదే వాస్తవం. మేం ప్రతికూల స్థితిలో ఉన్నాము. విండీస్ క్రికెట్ అభివృద్ధి చెందడానికి ఆర్థిక వనరులు చాలా అవసరం’ అని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ చెప్పుకొచ్చాడు. మొదటి టెస్ట్లో భారత్ రెండున్నర రోజుల్లో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించింది.
తాజావార్తలు
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!