Tomato Price: రూ.70కే కిలో టమాటా.. ఎక్కడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.200 నుంచి రూ.250కు విక్రయిస్తున్నారు. చండీగఢ్ రాష్ట్రంలోని ప్రజలు ఒక కిలో టమోటాను 300 నుంచి 350కి విక్రయిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణానికి బ్రేకులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ స్వయంగా ఢిల్లీ, నోయిడా మరియు లక్నోతో సహా దేశంలోని అనేక నగరాల్లో కిలో రూ.80 చొప్పున టమోటాలను విక్రయిస్తుంది. అయితే త్వరలో ప్రభుత్వ స్టాల్స్లో కిలో రూ.80 కంటే తక్కువ ధరకే టమాటాను విక్రయించనున్నారు. జులై 20 నుంచి కిలో రూ.70 చొప్పున టమాట విక్రయిస్తామని, తద్వారా ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని నాఫెడ్ ప్రకటించింది.
Bedurulanka 2012: ‘సొల్లుడా శివ’ అంటున్న కార్తికేయ
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
టమాటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. గురువారం నుంచి నాఫెడ్ దేశంలోని వివిధ నగరాల్లో టమాటాలను కిలో రూ.70కి విక్రయించనుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి టమోటాలను కొనుగోలు చేయనుంది. ఇలా చేయడం వల్ల ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరుగుతున్న టమాటా ధరలకు బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Pani Puri: పానీపూరీని ఇష్టంగా తింటున్నారా?..ఈ నిజాలు తెలుసుకోండి..
కేంద్ర ప్రభుత్వ సంస్థ NAFED ఇంతకుముందు ఢిల్లీ-ఎన్సిఆర్లోని అనేక ప్రదేశాలలో మొబైల్ వ్యాన్ల ద్వారా కిలోకు రూ. 90 చొప్పున టొమాటోలను విక్రయించింది. జూలై 16నుంచి కిలోపై రూ.10 తగ్గించి రూ.80కి విక్రయించింది. ప్రస్తుతం నాఫెడ్ లక్నో, వారణాసి, కాన్పూర్, పాట్నా, అర్రా, ముజఫర్పూర్లోని పలు ప్రాంతాల్లో కిలో రూ.80 చొప్పున టమాట విక్రయిస్తోంది. రేపటి నుంచి టమాటాలను కిలో రూ.70కి నాఫెడ్ విక్రయించనుంది.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!