Site icon NTV Telugu

CM Chandrababu: నేడు చీరాల మండలానికి చంద్రబాబు..చేనేత కార్మికులతో ముఖాముఖి

Cbn

Cbn

చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్ నుంచి సీఎం బయలుదేరుతారు. 3.35కు చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకి స్వాగతం పలుకుతారు.

READ MORE: CM Chandrababu: జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు

అనంతరం రోడ్డు మార్గం గుండా 3.50కు జాండ్రపేటలోని బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికుడి గృహాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత వీవర్స్ సర్వీస్ సెంటరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
చివరగా 5.30కు సభాస్థలి నుంచి బయలుదేరి 5.40 గంటలకు హెలీప్యాడ్ కి చేరుకుని వెలగపూడికి బయలుదేరి వెళతారు.

Exit mobile version