Today (26-12-22) Stock Market Roundup: ఈ వారం లాభాలతో ఆరంభం. ‘కొవిడ్’ నుంచి కోలుకున్న సూచీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (26-12-22) Stock Market Roundup: గతవారం మొత్తం వెంటాడిన కొవిడ్ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ ఎట్టకేలకు కోలుకుంది. ఈ వారం శుభారంభం లభించింది. ఇవాళ సోమవారం లాభాలతో మొదలై లాభాలతోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ ప్రభావం ఇండియన్ మార్కెట్పై ఏమాత్రం పడకపోవటం గమనించాల్సి విషయం.
రెండు సూచీలు కూడా బెంచ్ మార్క్కు పైనే ట్రేడ్ అవటం ఈ రోజు చెప్పుకోదగ్గ అంశం. సెన్సెక్స్ 721 పాయింట్లు పెరిగి మళ్లీ 60 వేల మైలురాయిని దాటింది. చివరికి 60 వేల 566 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 196 పాయింట్లు లాభపడి మరోసారి 18 వేల మైల్స్టోన్ని బ్రేక్ చేసింది. మొత్తానికి 18 వేల 3 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సువెన్ ఫార్మా, ట్రెంట్ సంస్థల షేర్ల వ్యాల్యూ బాగా పడిపోయింది. బీఎస్ఈ మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ ఇండెక్స్లు రెండున్నర శాతం వరకు ర్యాలీ తీశాయి.
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
read also: India in World Steel Production: ఉక్కు ఉత్పత్తిలో.. ప్రపంచంలో..
నిఫ్టీలో ఫార్మా కంపెనీల స్టాక్స్ తప్ప మిగతా అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లోనే ట్రేడ్ అయ్యాయి. మెటల్ మరియు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సూచీలు ఒక శాతం వరకు ప్రాఫిట్స్ పొందాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. ఎన్డీటీవీ షేర్లు 5 శాతానికి పైగానే లాభాలను ఆర్జించటం హైలైట్గా నిలిచింది. ఫౌండర్లు ప్రణయ్ రాయ్ మరియు రాధికా రాయ్లు ఈ కంపెనీలో 27 శాతానికి పైగా ఉన్న తమ షేర్లను అదానీ గ్రూపుకి విక్రయించాలని నిర్ణయించటం ఎన్డీటీవీకి కలిసొచ్చింది.
గత నాలుగు రోజుల్లో 15 శాతం తగ్గిన పూనావాలా ఫిన్కార్ప్ షేర్ల ధరలు ఇవాళ 13 శాతం పెరగటం విశేషం. 10 గ్రాముల బంగారం ధర నామమాత్రంగా 66 రూపాయలు మాత్రమే పెరిగి 54 వేల 640 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు కూడా అత్యంత స్వల్పంగా 22 రూపాయలు ప్లస్సయి 69 వేల 55 రూపాయలు పలికింది. రూపాయి విలువ మూడు పైసలు పడిపోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 83 పైసలుగా నమోదైంది.
తాజావార్తలు
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!