Bihar: సార్ మేమెక్కడ కూర్చోవాలి.. ఆగ్రహించిన విద్యార్థినులు
బీహార్లోని వైశాలిలో విద్యార్థినుల ఉగ్రరూపం కనిపించింది. మహ్నార్ బాలికల ఉన్నత పాఠశాలలో తరగతిలో కూర్చోవడానికి స్థలం లేదని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అంతేకాకుండా.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO) వాహనంపై విద్యార్థినులు రాళ్లు రువ్వారు. ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ సమయంలో పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులకు, విద్యార్థినులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఓ విద్యార్థి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.
Harsh Goenka: ఇస్రో ఛైర్మన్ జీతం ఎంతో తెలుసా..? అసలు విషయం బయటపెట్టిన ప్రముఖ పారిశ్రామికవేత్త
Also Read
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
వాస్తవానికి ఈ పాఠశాలలో 2 వేల 83 మంది బాలికలు చదువుతున్నారు. కానీ కేవలం 600 మంది బాలికలకు మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. మరోవైపు.. ఇక్కడ విద్యాశాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ కెకె పాఠక్ 75% హాజరు కావాలని ఆదేశించారు. దీంతో 75 శాతం హాజరుపై పర్యవేక్షణ జరుగుతోంది. అందువల్ల ఆ పాఠశాలలో హాజరు శాతం పెరిగింది. ఈరోజు(మంగళవారం) 1250 మందికి పైగా బాలికలు పాఠశాలకు హాజరయ్యారు.
Ileana : టాలీవుడ్ డైరెక్టర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఇలియానా..
వివరాల్లోకి వెళ్తే.. పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తరగతి గదిలో కూర్చోవడానికి స్థలం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత మహనార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అహల్య కుమారి అక్కడికి చేరుకుని విద్యార్థినులను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ విద్యార్థినులు వినకుండ ఆమె కారుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో కారు అద్దాలు పగులగొట్టారు. ఈ సమయంలో విద్యార్థినులు మహిళా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘర్షణలో ఓ విద్యార్థి స్పృహతప్పి పడిపోగా.. ఓ మహిళా పోలీసుకు కూడా గాయాలయ్యాయి.
Satyender Jain: సత్యేందర్ జైన్ బెయిల్ ఈనెల 25వరకు పొడిగింపు
అయితే మహిళా పోలీసు విద్యార్థినులు నిరసన చేస్తుండగా.. వారిని చెప్పుతో కొట్టిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో కోపోద్రిక్తులైన బాలిక విద్యార్థులు మహ్నార్ బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వాహనంపై దాడి చేశామని చెబుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే మహనార్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులను శాంతింపజేశారు. ఈ ఘటనపై మహనార్ బీఈవో అహల్య కుమారి మాట్లాడుతూ.. విద్యార్థినులను ఎవరో రెచ్చగొట్టారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థినులు రోజూ పాఠశాలలో కూర్చునేవారని.. కానీ ఇలా గందరగోళానికి పాల్పడ్డారని బీఈవో తెలిపింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆమే చెప్పారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
-
Virat Kohli: “ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు”.. కోహ్లీ ప్రశంసల వర్షం!
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!