Tamilnadu: దీపావళి వేళ ఉగ్ర కుట్ర ప్లాన్?.. కారులో గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనపై అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: దీపావళి పండుగ వేళ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉగ్రకుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కోయబత్తూరులో ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన యువకుడు 25 ఏళ్ల జమేషా ముబిన్గా గుర్తించారు. 2019లో ఈ ముబిన్ను ఎన్ఐఏ విచారించినట్లు తెలిసింది. ముబిన్ ఇంటిలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు, సల్ఫర్ లాంటి నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పేలిన కారు వివరాల గురించి పోలీసులు ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న ఆ కారు ఇప్పటివరకు 9 మంది పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. భవిషత్తులో ఏదో ప్లాన్ చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోందని తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు అన్నారు. ఈ ఘటన ప్రమాదమా లేక కుట్ర జరిగిందా అనే కోణంలో వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నామని డీజీపీ సి. శైలేంద్రబాబు తెలిపారు. ఈ కేసు దర్యాప్తును తమిళనాడు పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
ఆదివారం కోయంబత్తూరు నగరంలోని మతపరంగా సున్నితమైన ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారులో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఆ వ్యక్తి కాలి బూడిదయ్యాడు. డీజీపీ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటన ప్రమాదమా లేక ‘కుట్ర’ జరిగిందా అనే దానిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించగా డీజీపీ సి. శైలేంద్రబాబు తెలిపారు. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో ఈ సంఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న దుకాణాలన్నీ మూసివేయబడ్డాయి. ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు. మతపరమైన సున్నితమైన ప్రాంతం కావడంతో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించిన ఉక్కడం ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. “రెండు సిలిండర్లు ఉన్నాయి. ఒకటి పేలింది. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నాం. ప్రమేయం ఉన్న కారు యాజమాన్యాన్ని మార్చింది (చాలా సార్లు). మేము యజమానిని ట్రేస్ చేస్తున్నాము. మృతుడి గుర్తింపును గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Ayodhya Sets World Record: అయోధ్య గిన్నిస్ వరల్డ్ రికార్డు.. సరయూ నది ఒడ్డున 15 లక్షల దీపాలు
తమిళనాడు కమాండో స్కూల్కు చెందిన బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విచారణలో చేరినప్పటికీ, కోయంబత్తూరు కమిషనర్ వి.బాలకృష్ణన్ ఆధ్వర్యంలోని ఆరు ప్రత్యేక బృందాలు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణకు అవకాశం ఏమిటని ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేమని బాబు చెప్పారు. పేలిన కారు అవశేషాల నుంచి రాళ్లు, మేకులు దొరకడంపై అడిగిన ప్రశ్నకు, బాంబు నిర్వీర్య దళం, ఫోరెన్సిక్ నిపుణులు, స్నిఫర్ డాగ్లను రంగంలోకి దించామని విచారణ అనంతరం అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పారు. వాహనం స్పీడ్ బ్రేకర్ దాటి వెళ్లిన వెంటనే సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయి పేలుడుకు దారితీసిందన్న నివేదికలపై, ఉగ్ర కుట్రతో సహా అన్ని కోణాలను విచారిస్తామని, విచారణ పూర్తయిన తర్వాతే నిర్ధారణకు రాగలమని చెప్పారు. ఫైర్ అండ్ రెస్క్యూ డిపార్ట్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..