Fake Registration: ఏం తెలివిరా నాయనా.. భూమిని ఆక్రమించడానికి తహసీల్దార్, వీఆర్ఓ సంతకాల ఫోర్జరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఒకరి భూమిని మరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన ఉదంతం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆశ్రయించడంతో ఈ నకిలీ పత్రాల దందా గుట్టు రట్టయింది. బాధిత రైతు నెక్కలపూడి శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. తిరువూరు పట్టణ పరిధిలోని రాజుపేట రెవెన్యూ గ్రామంలో గల ఆర్ఎస్ నెంబర్ 126/2, 126/4, 126/5 లోని తన భూములపై గతంలో వివాదాలు నడిచాయి. దీనిపై ఆయన తిరువూరు సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన న్యాయస్థానం 2006లోనే శ్రీనివాసరావుకు అనుకూలంగా పర్మనెంట్ ఇంజంక్షన్ (శాశ్వత స్టే) ఆర్డర్ ఇస్తూ తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం గుంజి సరవయ్య కుమారులు ఆ భూముల్లోకి ప్రవేశించడానికి వీల్లేదు.
తహశీల్దార్, వీఆర్ఓ సంతకాలు ఫోర్జరీ..
కోర్టు ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నప్పటికీ, గుంజి సరవయ్య కుమారులు చట్టాన్ని ఉల్లంఘించారు. ఆ భూమి తమ స్వాధీనంలోనే ఉన్నట్లు అబద్ధపు సాక్ష్యాలను సిద్ధం చేశారు. మోదుగు ప్రసన్న అనే డాక్యుమెంట్ రైటర్ సహాయంతో అప్పటి తిరువూరు తహశీల్దార్ ప్రకాష్ బాబు, రాజుపేట వీఆర్ఓ సిహెచ్. గోపాలకృష్ణల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పొజిషన్ సర్టిఫికెట్లను సృష్టించారు.
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
- Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు..
ఈ ఫోర్జరీ ధ్రువీకరణ పత్రాల ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారుల కళ్లు గప్పి గుంజా కృష్ణయ్య, నాగరాజు, శ్రీను, జమలయ్య, కేశవులు తదితరుల పేర్లపై 6825/2025 నుండి 6848/2025 వరకు గల ఐదు వేర్వేరు డాక్యుమెంట్ల ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ నకిలీ పత్రాలతో సదరు వ్యక్తులు ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించిన తరుణంలో అసలు విషయం బయటపడింది.
పీజీఆర్ఎస్ లో బాధితుడి ఫిర్యాదు..
తన భూమి అక్రమంగా చేతులు మారిందని తెలుసుకున్న బాధితుడు శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఉన్నతాధికారులను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తప్పుడు పత్రాలు సృష్టించిన నిందితులపై, సహకరించిన డాక్యుమెంట్ రైటర్పై కఠిన చర్యలు తీసుకుని, తన భూమిని తనకు దక్కేలా న్యాయం చేయాలని బాధితుడు లబోదిబోమంటూ అధికారులను వేడుకున్నాడు.
తాజావార్తలు
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Ashwini Vaishnaw: 320 కిమీ వేగం.. 12 స్టేషన్లు.. 508 కి.మీ కారిడార్.. బుల్లెట్ రైలుపై కేంద్ర మంత్రి కీలక అప్డేట్..
-
Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!